మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అగ్ర కుటుంబంలో నందమూరి కుటుంబం ఎప్పుడు ముందు వరుసలో ఉంటుంది .. ఈ కుటుంబంలో బాలకృష్ణ ,కళ్యాణ్ రామ్ , ఎన్టీఆర్ ఇలా కుటుంబం మొత్తం హీరోలే .. అలాంటి కుటుంబం నుంచి మరో హీరో వస్తుంటే వీరిలో ఒక్కడు కూడా అక్కడ కనిపించలేదు .. ఇక్కడ ఇదే విచిత్రం .. టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు వైవిఎస్ చౌదరి కొత్త మూవీ లాంచ్ అయింది .. నటరత్న ఎన్టీఆర్ ముని మనవడు , హరికృష్ణ మనవడు దివంగత జానకిరామ్ కొడుకు తారక రామారావును హీరోగా పెట్టి స్వీయ దర్శకత్వంలో వైవిఎస్‌ చౌదరిసినిమా చేయబోతున్న విషయం తెలిసిందే ..
 

ఇక నిన్న ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలతో లాంచ్ అయింది ..  అయితే ఈ కార్యక్రమానికి బాలకృష్ణ , ఎన్టీఆర్ , కళ్యాణ్రామ్ .. ఇలా ఎవ్వరు ఇందులో కనిపించలేదు మిగతా నందమూరి కుటుంబ సభ్యులంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు .. అలాగే బాలకృష్ణ ఫ్యామిలీ నుంచి బాలయ్య భార్య వసుంధర మాత్రమే వచ్చారు .. ఇదే క్రమంలో ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఈ ముగ్గురు హీరోలు దూరంగా ఉంటూ వస్తున్నారు .. ఇక ఈ విషయం పై ఓ సందర్భంలో వైవిఎస్‌ను ప్రశ్నిస్తే ఆయన కూడా ఫైర్ అయ్యారు .. సినిమా చేసే వాడికి కథ తెలుసా తెలియదా అని అడగటం వరకే మీ పని సినిమా చేసే వాడికి కథ తెలుసు అంతకుమించి ఆసక్తి ఏంటి మీకు ?


వారి కుటుంబంలో ఉన్న  హీరోలు అందరికీ కథ తెలుసా అని మీరు అడుగుతున్నారు .. అలా తెలియాల్సిన అవసరం ఏముందని నేను అడుగుతున్నాను అంటూ .. వైవిఎస్ ఫైర్ అయ్యాడు .. అలా అప్పటినుంచి నందమూరి హీరోలకు దూరంగానే ఈ సినిమా ముందుకు జరుపుతూ వస్తున్నాడు చౌదరి .. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ను మొద‌లు పెట్టే పనిలోకి వచ్చాడు.. నందమూరి కుటుంబంలో అందరూ హీరోలు ఆశీస్సులు తమ సినిమాకు ఉన్నాయన్న వైవిఎస్ .  కనీసం ఈ సినిమా ప్రమోషన్ల కోసమైనా ఆ నందమూరి అగ్ర హీరోలను కలుస్తాడో లేదో  చూడాలి ..

మరింత సమాచారం తెలుసుకోండి: