ఆర్కే నాయుడు అలియాస్ సాగర్ .. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ఫేవరెట్ నటుడు .. మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి ఈ నటుడికి ఫ్యాన్ అంటే సాగర్ క్రేజ్ ఎలాంటిదో అంత అర్థం చేసుకోవచ్చు .. చక్రవాకం , మొగలిరేకులు సీరియల్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఈ నటుడు ముఖ్యంగా మొగలిరేకులు సీరియల్ ఆర్కే నాయుడు , మున్నా, మహీధర్ నాయుడుగా బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు .. అయితే  వీటి తర్వాత బుల్లితెరపై కనిపించలేదు సాగర్ వెండితెరపై నటుడుగా తన అదృష్టం పరీక్షించుకున్నాడు .. ఉదయ్ కిరణ్ మనసంతా నువ్వే , ప్రభాస్ మిస్టర్ పర్ఫెక్ట్, సిద్ధార్థ, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సపోర్టింగ్ రోల్స్ తో మెప్పించాడు ..


అలాగే 2021 లో వచ్చిన షాదీ ముబారక్ సినిమాతో హీరోగాను విజయం అందుకున్నాడు సాగర్ . అయితే ఇప్పుడు వెండి తేర‌ మీద చాలా గ్యాప్ తీసుకున్నాడు మళ్ళీ ఇప్పుడు ది 100 అంటూ డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు .. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా జులై 11న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది .. రీసెంట్ గానే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు .  ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ల భాగంగా వరస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు సాగర్ .. ఈ క్రమంలోనే తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నాడు .


తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన భార్య గురించి ఈ విధంగా చెప్పకు వచ్చాడు సాగర్ .. తన భార్య పేరు సౌందర్య గతంలో ఓ డిజిటల్ మీడియా కంపెనీ నిర్వహించింది .. అలాగే పిల్లలు పుట్టక గ్యాప్ తీసుకుంది.. ఇక ప్రస్తుతం ఆత్మన్ ది లేబుల్ అనే క్లాత్ బ్రాండ్ ని మొదలుపెట్టింది .. క్లాత్ బిజినెస్ చేస్తుంది.  అందులో ఇంకా రీసెర్చ్ కూడా చేస్తుందని తన ఫ్యామిలీ గురించి చెప్పుకొచ్చాడు సాగర్. అలాగే ఆర్కే సాగర్  , సౌందర్య దంపతులకు ఒక బాబు ఒక పాప ఉన్నారు సౌందర్య తన పిల్లల పెంపకంతో పాటు క్లాత్ బిజినెస్ కూడా నడిపిస్తుంది . అలాగే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది .. ఎప్పుడు తన బిజినెస్ కి సంబంధించిన విషయాలను రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటుంది.. అలాగే తన పిల్లల ఫోటోలు కూడా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంటుంది .





మరింత సమాచారం తెలుసుకోండి: