ఈ మద్య ఎక్కడ చూసినా రోడ్డు ప్రమాదాలే..డ్రైవర్ల నిర్లక్ష్యం...మద్య సేవించి డ్రైవింగ్ చేయడం..అత్యంత వేగం, అనుకోని దుర్ఘటనలు ఇలా ప్రతిరోజు దేశ వ్యాప్తంగా ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు సంబవించిన వదులు, వందల సంఖ్యల్లొ మరణిస్తున్నారు. తాజాగా షూటింగ్ ముగించుకుని తిరిగి వస్తున్న ఆర్టిస్టులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి అదుపు తప్పిన కారు చెట్టును ఢీకొనడంతో ఇద్దరు టీవీ ఆర్టిస్టులు దుర్మరణం చెందారు.
కాగా, వీరు ఓ సీరియల్ షూటింగ్ కోసం హైదరాబాద్ నుంచి సోమవారం రాత్రి వికారాబాద్ జిల్లా అనంతగిరి అడవులకు వెళ్లారు. అనంతగిరి గుట్టలపై షూటింగ్ పూర్తి చేసుకున్న ప్రోడక్షన్ యూనిట్ కారులో హైదరాబాద్కు తిరిగి వస్తోంది. ఇదే సమయంలో మొయినాబాద్ మండలం అప్పారెడ్డిగూడ బస్టాప్ వద్ద ఆర్టిస్టులు ప్రయాణిస్తున్న కారు అత్యంత వేగంతో వస్తున్న లారీని తప్పించబోయి అదే వేగంతో చెట్టుకు గుద్దుకున్నారు.
కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో నిర్మల్ ప్రాంతానికి చెందిన భార్గవి (20) అక్కడికక్కడే మరణించగా, భూపాలపల్లి జయశంకర్ జిల్లాకు చెందిన అనుషారెడ్డి (21) ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందింది. ఇక కారు డ్రైవర్ చక్రి, మరో ఆర్టిస్ట్ వినయ్ కుమార్ లకు తీవ్ర గాయాలు కావడంతో వీరిని హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.