టాలీవుడ్ లో పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ‘బద్రి’ సినిమాతో ఒకరంటే ఒకరు ఇష్టపడి ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు పవన్ కళ్యాన్, రేణు దేశాయ్. ఆ తర్వాత వీరి కాపురం ఏడేళ్లు సాగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. కొంత కాలం తర్వాత వీరి మద్య అభిప్రాయ భేదాలు రావడంతో విడిపోయారు. ప్రస్తుతం పూణే లో రేణు దేశాయ్ తన పిల్లలతో ఉంటుంది. పవన్ కళ్యాన్ మరో మహిళను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం పవన్ కళ్యాన్ ‘జనసేన’ పార్టీ స్థాపించిన విషయం తెలిసిందే.. వచ్చే ఎన్నికల్లో పాల్గొంటున్న నేపథ్యంలో ప్రచారంలో మునిగిపోయారు.
ఆయన మాజీ భార్య రేణు దేశాయ్ కి ఆ మద్య నిశ్చితార్థం జరిగింది. తాజాగా 'జానీ' సినిమా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎన్నో విషయాలు వెల్లడించింది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావడానికి రెండు వారాల ముందు తనను కథానాయికగా ఎంపిక చేశారని.. కానీ మొదట్లో తాను ఒప్పుకోలేదని.. చివరికి పవన్ తనను ఒప్పించారని రేణు తెలిపారు.జానీ సినిమాకు నేను మొదట ప్రొడక్షన్ డిజైనర్గా పనిచేశాను. షూటింగ్కు రెండు వారాల ముందు నన్ను ఈ సినిమాకు హీరోయిన్గా ఎంపిక చేశారు.
అనుకోకుండా తీసుకున్న ఈ నిర్ణయానికి నేను ఆశ్చర్యపోయాను..అసలు నటించనని చెప్పాను. నా ఆసక్తి మొత్తం ప్రొడక్షన్ డిజైనింగ్, సాంకేతిక వర్గంపైనే ఉంది. మొత్తానికి నన్ను పవన్ కళ్యాన్ దగ్గరుండి ఒప్పించారు. దాంతో నాకు అదనంగా రెండు మూడు పనులు వచ్చిపడ్డాయి. ప్రొడక్షన్ డిజైనర్గా పనులు చూసుకుని, మేకప్ రూమ్కి వెళ్లి హీరోయిన్గా సిద్ధమయ్యేదాన్ని. జీవితం ఏదైనా సవాలు విసిరితే.. స్వీకరించాలి. అప్పుడే మనం వ్యక్తిగతంగానూ, వృత్తిపరంగానూ ఎంతో నేర్చుకుంటాం’’ అని రేణు ఇన్స్టాగ్రాంలో పేర్కొన్నారు.