ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరు సినిమా ఓ హాట్ టాపిక్.. థ్రిల్లర్ జోన్ లో రూపొందిన ఈ సినిమాకు అన్ని వర్గాల నుంచి ఆదరణ బాగా లభిస్తోంది. అందులోనూ ఇప్పుడు పెద్దగా సినిమాలు కూడా ఏమీ లేకపోవడంతో బాగానే వసూళ్లు రాబడుతోంది. సాహో వచ్చేవరకూ ఎవరు హవా కొనసాగేలా కనిపిస్తోంది.
అయితే ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించిన వారిలో హీరోయిన్ రెజీనా కసాండ్రాది కీలక పాత్ర. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఆగస్ట్ 15న విడుదలై మంచి విజయాన్ని సాధించింది. వెంకట్ రామ్జీ దర్శకత్వంలో రూపొందింది . ఈ సందర్భంగా ఆయన చిత్ర విశేషాలను మీడియాతో ముచ్చటించారు.
రెజీనా ఈ సినిమాలో నటించిన తీరు చూస్తే.. ఇన్నాళ్లూ ఇండస్ట్రీ తనను సరిగ్గా వాడుకోలేదేమో అన్న వాదన వినిపిస్తోంది. డైరెక్టర్ వెంకట్ రామ్ జీ కూడా అదే చెబుతున్నారు. ఆయన ఏమన్నారంటే... అవును.. రెజీనా కళ్ళు భావోద్వేగాలను బాగా పలికించగలవు. అందుకే సినిమాలో నేను ఎక్కువుగా క్లోజ్ షాట్స్ పెట్టడానికి కారణం రెజీనానే. కథ చెబుతున్నప్పుడే ఆమె కథలోని తన క్యారెక్టర్ కి బాగా కనెక్ట్ అయ్యారు. అచ్చం సమీరాలానే ఆమె చాలా బాగా చేసింది.
రెజీనా దాదాపు 7-8 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంది. ఆమెకు ఎలాంటి సినిమాలు చేయాలో తెలుసు. తను చాలా సినిమాలు చేశాయి. `అ!` నుండి తన పంథా మార్చుకుంది. ఇకపై కెరీర్లో ఏ సినిమా చేసినా ఓ గట్ ఫీలింగ్తో చేస్తుందని నేను నమ్ముతున్నాను. తను ఎక్స్ప్రెసివ్.. సెటిల్డ్గా నటిస్తుంది. ఈ సినిమా విషయానికి వస్తే.. తను క్యారెక్టర్లోని లేయర్స్ పరంగా అద్భుతంగా నటించింది. ఇలా ప్రశంసించారు రామ్ జీ.. అంటే సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు రెజీనాకు మంచి టైమ్ వచ్చినట్టుంది. ఇలాంటి సినిమాలు రెండు, మూడు పడితే ఆమె గ్రాఫ్ బాగా పైకిలేవడం ఖాయం.