ప్రస్తుతం రాష్ట్రంలో స్థానిక ఎన్నికల విషయం బర్నింగ్ అంశం గా మారుతున్న సంగతి తెలిసిందే.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వైసీపీ ప్రభుత్వానికి ఎడ్డం అంటే తెడ్డం అనే రీతిలో వ్యవహరిస్తున్నారు.. స్థానిక ఎన్నికలు నిర్వహించాలన్నప్పుడు వద్దన్నాడు.. ఇప్పుడు వద్దు అంటుంటే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని అంటున్నారు.. ఈ వ్యవహారం అధికార పార్టీ కి కొంత తలనొప్పి గా తయారవుతుంది.గతంలో కూడా ఇదే తరహాలో నిమ్మగడ్డ వ్యవహరించి కోర్టు దాక వెళ్ళాడు.. అయితే అక్కడ కోర్టు నిమ్మగడ్డ కు బుద్ధి చెప్పింది అనుకోండి.. ప్రభుత్వం చెప్పినట్లు విని ప్రభుత్వానికి సహకరిస్తూ పనులు చేయాలనీ చెప్పింది..