సాఫీగా సాగిపోతున్న ఆ మహిళ జీవితంలో ఓ సంఘటన చోటు చేసుకుంది. తన పేరుతో ఇంటర్నెట్ లో ఎవరు కాల్ గర్ల్ గా ప్రొఫైల్ క్రియేట్ చేసి తన ఫోన్ నెంబర్ పెట్టారు. దీంతో మహిళకు ఫోన్ కాల్స్ వస్తూ వేధింపులు ఎక్కువ కావడంతో చివరికి సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది మహిళా . అయితే పోలీసుల విచారణలో తేలిన నిజం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. Aa మహిళను సోషల్ మీడియాలో వ్యభిచారిగా చిత్రించింది ఆ మహిళ భర్త అని. భార్య భర్తల అన్న తర్వాత గొడవలు పడటం కామన్. చిన్న చిన్న గొడవలు అవుతూనే ఉంటాయి మళ్ళీ ప్రేమగా మాట్లాడుకుంటుంటారు. కానీ భర్త మాత్రం తరచూ తమ మధ్య గొడవలు కావడంతో పగ పంచుకున్నారు... దీంతో తన భార్యను పరువు తీయాలి అని భావించి...నీచంగా అలోచించి తన భార్యను వ్యభిచారిగా చిత్రీకరించాడు. సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు పెట్టి కాల్ గర్ల్ అంటూ తన భార్య ఫోన్ నెంబర్ పెట్టి మరీ ప్రచారం చేశాడు.దీంతో మహిళా వేధింపులు తాళలేక పోలీసులను ఆశ్రయించటం తో అసలు నిజం బయటపడింది.
వివరాల్లోకి వెళితే... జాన్ జార్ట్ అనే వ్యక్తి భార్యతో కలిసి లక్ష్మీ నగర్ లో నివాసం ఉంటున్నారు. అయితే జాన్ జార్ట్ కుషాయిగూడ లోని రాధిక థియేటర్ లో ప్రొజెక్టర్ ఆపరేటర్ గా పని చేస్తున్నాడు. అయితే జాన్ జార్ట్ భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలకి గొడవలు జరిగేవి. ఈ నేపథ్యంలో భార్య పై పగ పెంచుకుని ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నాడు. ఈ నేపథ్యంలో నీచ బుద్దితో ఆలోచించిన భర్త... భార్య తన స్నేహితులతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఇందులో కనిపిస్తున్న వాళ్ళందరూ కాల్ గర్ల్స్ అని వాయిస్ కూడా ఇచ్చాడు. తన భార్య సెల్ ఫోన్ నెంబర్ కూడా ఆన్ లైన్ లో పెట్టేసాడు ఈ ప్రబుద్ధ భర్త.
దీంతో ఆ మహిళ కి కాల్స్ రావడం మొదలుపెట్టాయి. ఏం జరుగుతుందో ఆ మహిళకి అర్థం కాలేదు. రోజు రోజుకి కాల్స్ ఎక్కువవడంతో ఏం చేయాలో తెలియక పోలీసులను ఆశ్రయించింది ఆ మహిళ. అయితే మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు... ఇంత నీచానికి ఒడిగట్టింది తన భర్తేనని మహిళకి తెలిపారు. తన భర్త జాన్ జార్ట్ ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు. అయితే ఇదంతా చేసింది తన భర్త అని తెలియడంతో ఆ మహిళ షాక్ కు గురైంది.