నేడు విశాఖలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. విశాఖ శివారులోని వెంకటాపురం గ్రామ దేగ్గలోని ఎల్ జి పాలిమర్ పరిశ్రమ నుంచి పివిసి గ్యాస్ లీక్ అవడంతో చాలా మంది వరకు అస్వస్థతకు గురి అయ్యారు. అలాగే ఇప్పటివరకు 8 దాకా చనిపోవడం జరిగింది. ఇక తాజాగా మరోసారి గ్యాస్ లీక్ అవ్వడంతో అక్కడ ఉన్న ప్రజలు ఆందోళనలకు గురి అవుతున్నారు. ఈ వాయువులు పీల్చుకున్న ప్రజలు శ్వాస సంబంధిత సమస్యతో అవుతున్నారు. అంతేకాకుండా మూగజీవాలు కూడా మృత్యువాత పడ్డాయి.

 

 

ఇక  ఈ సంఘటనపై వివిధ రాష్ట్ర ముఖ్యమంత్రులు, ప్రధాని మోడీ రాష్ట్రపతి విచారణ వ్యక్తం చేయడం జరిగింది. ఈ సంఘటనపై అత్యవసర సమీక్ష కూడా నిర్వహించారు. అసలు విషయానికి వస్తే టాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా చేసుకొని విచారం వ్యక్తం చేయడం జరిగింది. ఇక ఇందులో భాగంగా మెగాస్టార్ చిరు, మహేష్, అల్లు అర్జున్, రవితేజ నాగశౌర్య, రామ్, సాయి ధర్మ తేజ్, సందీప్ కిషన్, సుధీర్ బాబు, అల్లరి నరేష్, నాని వారి రీతిలో బాధను వ్యక్తం చేయడం జరిగింది.

 

 


ఈ సంఘటనపై టాలీవుడ్ హీరో శ్రీకాంత్ స్పందిస్తూ.. వైజాగ్ లో జరిగిన ఘటన చాలా బాధాకరంగా అనిపిస్తుంది... నిజానికి ఒక ఆశ్చర్యకరమైన విషయం అని తెలిపారు. అంతేకాకుండా బాధితులు త్వరగా కోలుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను అని శ్రీకాంత్ ట్విట్టర్ వేదికగా బాధను వ్యక్తం చేయడం జరిగింది.

 


మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ కూడా ట్విట్టర్ ద్వారా... వైజాగ్ గ్యాస్ లీక్ వార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. అలాగే ప్రభావిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు. ఈ విషయాన్ని తన అధికారిక ట్విట్టర్ వేదికగా ద్వారా తెలిపాడు.

 


ఇక ఇదే కోవలో నాచురల్ స్టార్ నాని కూడా ఈ విషయంపై స్పందించాడు. ఇది గుండె పగిలే లాంటి సంఘటనని... బాధితులు త్వరగా కోలుకోవాలని ప్రార్థన చేయాలని నాని తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: