వివాహేతర సంబంధాలు రోజు రోజుకు పెరిగి పోతున్నాయి.. ప్రియుడి తో శృంగారానికి అడ్డుగా వస్తున్న భర్తలను అతి దారుణంగా చంపుతున్నారు ప్రస్తుత ప్రతివర్తలు..తర్వాత ఏమి ఎరగనట్లు పోలీసుల ముందు నటిస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఇటీవల లెక్క లేనన్ని వెలుగు చూస్తున్నాయి. ఇప్పుడు కూడా అలాంటి ఘటనే ఎదురైంది. కరీంనగర్ జిల్లాలో వెలుగు చూసింది..కరీంనగర్‌ నగరపాలక సంస్థలో కాంట్రాక్ట్‌ కార్మికుడిగా పనిచేస్తూ రేకుర్తిలో నివాసం ఉంటున్నాడు రాజయ్య.ఈ క్రమంలో రాజయ్య ఈ నెల 5న పని ముగించుకొని తిరిగి ఇంటికి రాలేదని అతని భార్య లత ఠాణాలో ఫిర్యాదు చేసింది.


పోలీసులు 7న మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఈ 16న మహబూబాబాద్‌ జిల్లా కురవి పోలీసులు గుర్తు తెలియని మృతదేహం లభ్యమైందని అన్ని ఠాణాలకు సమాచారం అందించారు. దీంతో ఇక్కడి పోలీసులు రాజయ్య కుటుంబీకులను అక్కడికి తీసుకెళ్లి చూపించగా మృతదేహం అతనిదేనని గుర్తించారు. మృతుడి కుటుంబసభ్యులు ఆటోడ్రైవర్‌ ఎనగండుల బాబుపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా రాజయ్య భార్య లతకు అతనికి ఉన్న సంబంధం బయట పడింది.


తనతో గడపటానికి తన భర్త అడ్డువస్తున్నాడని, అతన్ని చంపేయాలని లత కోరింది.రాజయ్యను కల్లు తాగుదామని తన స్వగ్రామం హుస్నాబాద్‌ మండలం మడదకు ఆటోలో తీసుకెళ్లాడు. కల్లు తాగాక చంపడం వీలుకాకపోవడంతో తిరిగి తీసుకువస్తున్నాడు. లత ఫోన్‌ చేసి, చంపేయాలని పట్టుబట్టింది. దీంతో బాబు ముంజంపల్లి కెనాల్‌ వద్దకు తీసుకువెళ్లి, రాజయ్యకు మళ్లీ కల్లు తాగించాడు. అతని మెడపై బలంగా కొట్టడంతో కిందపడ్డాడు. తర్వాత కెనాల్‌లోకి నెట్టేసి, బాబు ఇంటికి వెళ్లాడు. పోలీసుల విచారణలో నేరం చేసినట్లు లత, బాబు అంగీకరించడంతో వారిద్దరినీ రిమాండ్ కు తరలించారు. తండ్రి చనిపోవడం, తల్లి జైలు పాలు కావడం తో పిల్లలు అనాథలుగా మారారు.. వారిని చూసిన గ్రామస్తులు కంటతడి పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: