పోలీసులు 7న మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఈ 16న మహబూబాబాద్ జిల్లా కురవి పోలీసులు గుర్తు తెలియని మృతదేహం లభ్యమైందని అన్ని ఠాణాలకు సమాచారం అందించారు. దీంతో ఇక్కడి పోలీసులు రాజయ్య కుటుంబీకులను అక్కడికి తీసుకెళ్లి చూపించగా మృతదేహం అతనిదేనని గుర్తించారు. మృతుడి కుటుంబసభ్యులు ఆటోడ్రైవర్ ఎనగండుల బాబుపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా రాజయ్య భార్య లతకు అతనికి ఉన్న సంబంధం బయట పడింది.
తనతో గడపటానికి తన భర్త అడ్డువస్తున్నాడని, అతన్ని చంపేయాలని లత కోరింది.రాజయ్యను కల్లు తాగుదామని తన స్వగ్రామం హుస్నాబాద్ మండలం మడదకు ఆటోలో తీసుకెళ్లాడు. కల్లు తాగాక చంపడం వీలుకాకపోవడంతో తిరిగి తీసుకువస్తున్నాడు. లత ఫోన్ చేసి, చంపేయాలని పట్టుబట్టింది. దీంతో బాబు ముంజంపల్లి కెనాల్ వద్దకు తీసుకువెళ్లి, రాజయ్యకు మళ్లీ కల్లు తాగించాడు. అతని మెడపై బలంగా కొట్టడంతో కిందపడ్డాడు. తర్వాత కెనాల్లోకి నెట్టేసి, బాబు ఇంటికి వెళ్లాడు. పోలీసుల విచారణలో నేరం చేసినట్లు లత, బాబు అంగీకరించడంతో వారిద్దరినీ రిమాండ్ కు తరలించారు. తండ్రి చనిపోవడం, తల్లి జైలు పాలు కావడం తో పిల్లలు అనాథలుగా మారారు.. వారిని చూసిన గ్రామస్తులు కంటతడి పెడుతున్నారు.