అనంతపురం లో టీడీపీ నేత నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు పై మంత్రి కొడాలి నానీ ఫైర్ అయ్యారు నేడు. మమ్మల్ని కుక్కలు అని పిచ్చి వ్యాఖ్యలు చేస్తే ప్రజలు వీళ్ళని కుక్కల్ని కొట్టినట్టు కొడతారు అని అన్నారు ఆయన. ఎమ్మెల్యేగా గెలవలేని లోకేష్ అధికారంలోకి వస్తానని కలలు కంటున్నాడు అని ఆయన మండిపడ్డారు. 25 వేలు ఓట్లు ఉన్న కుప్పం కోసం చంద్రబాబు నానా కుప్పిగంతులు వేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేసారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు కూడా కుప్పంలో గెలవలేరు అని వార్నింగ్ ఇచ్చారు.

లోకేష్ బ్లడ్ లో కొవ్వు ఉంది.. మొన్నే 30 కేజీలు కోసి తీశారు అని ఎద్దేవా చేసారు. ఐదేళ్లు ప్రభుత్వ స్కూల్స్ ని నాశనం చేశారు అన్నారు ఆయన. విద్యార్థుల్ని సీఎం జగన్ సొంత పిల్లలా చూస్తున్నారు అని తెలిపారు. నాడు నేడు ద్వారా స్కూల్స్ రూపురేఖలు మార్చి అభివృద్ధి చేసారు అని అన్నారు ఆయన. విద్యార్థులకు కావాల్సిన అన్ని సదుపాయాలు సీఎం జగన్ ఉచితంగా ఇస్తున్నారు అని వ్యాఖ్యలు చేసారు. ఎయిడెడ్ స్కూల్స్ అభివృద్ధి చేయడానికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అని అన్నారు.

వారికి మూడు అప్సన్స్ ఇచ్చింది ఇష్టం అయిన వాళ్ళు ఇస్తున్నారు.. నడుపుకునేవారు నడుపుకుంటున్నారు అని ఆయన వ్యాఖ్యానించారు. విద్యార్థి సంఘాల ముసుగులో గొడవలు సృష్టిస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేసారు. మేము ఏ జీవో లు ఉపసంహరించుకొము అని స్పష్టం చేసారు. ఎయిడెడ్ పై మా విధానం కొనసాగిస్తాం అన్నారు ఆయన. ఎయిడెడ్ లో ఎక్కడైనా ఫ్రీ గా చెప్తున్నారా.. ఫీజులు వసూల్ చేస్తున్నారు కదా అని ప్రశ్నించారు. మహానుభావులు ఇచ్చిన ఆస్తులు కొందరు ప్రేవేటు వ్యక్తులు దోచుకుంటున్నారు అని అన్నారు. ఆ దోపిడీని అరికట్టడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అని తెలిపారు ఆయన. పులివెందులలో జగన్ కుటుంబానికి చెందిన సొంత స్కూల్ ని ఆస్తుల్ని ప్రభుత్వం కు అప్పగించారు అని పేర్కొన్నారు. ఎయిడెడ్ స్కూల్ ఆస్తులు కాజేస్తున్నారని చంద్రబాబు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు అని  కొడాలి నానీ మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: