అయితే పీవీ రమేష్ తర్వాత తన ట్వీట్ లో తప్పును గ్రహించి ఆ ట్వీట్ లో మార్పులు చేసి అడ్డంగా బుక్కయ్యారు. జగన్ సర్కార్ పరువు తీయాలని టార్గెట్ చేసి మరీ పీవీ రమేష్ ట్వీట్ చేసినట్టు ఉందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపించాయి. మరోవైపు ఆయన ట్వీట్ లో స్వగ్రామంలో ఉన్న భూమికి సంబంధించి మ్యుటేషన్ జరగలేదని తీవ్రస్థాయిలో ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
ఆ తర్వాత ల్యాండ్ టైట్లింగ్ చట్టం అమల్లోకి రాకముందే ఇలాజరిగింది అంటూ ట్వీట్ లో మార్పులు చేశారు. చట్టం అమలులోకి రాకుండానే అన్యాయం ఎలా జరుగుతుందని ఆ చట్టం గురించి ప్రస్తావించాల్సిన అవసరం ఏముందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. పీవీ రమేష్ తో బాటు అయన సోదరులకు కూడా భాగం ఉందని, ఈ క్రమంలో భూమి మ్యుటేషన్ కోసం వారు కూడా దరఖాస్తు చేసుకోవాలని అందుకే ఆయన భూమి మ్యుటేషన్ జరగలేదని అధికారులు చెబుతున్నారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం మ్యూటేషన్ కోసం పలు పత్రాలు సమర్పించాల్సి ఉన్నా ఆ పత్రాలను సమర్పించకుండా మ్యుటేషన్ చేయమంటే ఎలా చేస్తారో పీవీ రమేష్ చెప్పాలని
అధికారులు కామెంట్లు చేస్తున్నారు. ఒక పార్టీ మీడియా ట్రాప్ లో పడి పీవీ రమేష్ ఇబ్బందుల్లో పడ్డారని నెటిజన్లు, వైసీపీ అభిమానులు చెబుతున్నారు. పీవీ రమేష్ తనవని చెబుతున్న భూముల్లో కొంత ప్రభుత్వ భూములు సైతం ఉన్నాయని భోగట్టా. ఒక రైతుతో పీవీ రమేష్ కు సరిహద్దు వివాదం కూడా ఉందని సమాచారం అందుతోంది. పీవీ రమేష్ విన్నుకోటకు వచ్చి వాస్తవాలు తెలుసుకోవాలని పేర్ని నాని సూచించారు.