
ఆంధ్రప్రదేశ్లో బిజెపి కూటమి ప్రభుత్వంలో అధికారంలో ఉంది. మొన్న ఎన్నికలలో బిజెపి నుంచి ఏపీలో కొందరు ఎంపీలు ... ఎమ్మెల్యేలు కూడా విజయం సాధించారు. బిజెపి కూడా ప్రభుత్వంలో చేరింది. ఇదిలా ఉంటే గత ఐదారు నెలలుగా ఆ పార్టీకి చెందిన ఎంపీకి .. ఎమ్మెల్యేకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ పై అదే పార్టీకి చెందిన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లాలోని వైసీపీ నాయకులకు అదృశ్య శక్తి మద్దతు ఇస్తుందని .. ఇది సరైనది కాదంటూ పరోక్షంగా సీఎం రమేష్ ను ఆయన హెచ్చరిస్తున్నారు. తాజాగా మీడియా సమావేశంలో ఆయన మరోసారి సిమెంట్ పరిశ్రమల మేనేజ్మెంట్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సిమెంట్ పరిశ్రమలలో లోడింగ్ .. అన్లోడింగ్ తదితర కాంట్రాక్టు పనులన్నీ వైసీపీ నాయకులు కడప ఎంపీ అవినాష్ రెడ్డి - ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి - మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి - ఆయన చిన్నాన్న ఎంవీ రమణారెడ్డికే ఇప్పటికి కొనసాగుతున్నాయని ... అవన్నీ తప్పు కోవాల్సిందే అని ఆయన తేల్చి చెప్పారు.
తన వెంట్రుక కూడా బిజెపి పీకలేదని వైయస్ జగన్ అన్నారని ... జగన్ కు తిరుమల గుండు కొట్టించి శాశ్వతంగా రాజకీయాలు లేకుండా చేస్తామని ఆయన హెచ్చరించారు. ప్రజలకు మంచి చేయాలని సిమెంట్ పరిశ్రమలని కోరడమే తాము చేసిన తప్పా ? అని ఆయన ప్రశ్నించారు. నిబంధనలకు విరుద్ధంగా సిమెంట్ పరిశ్రమల యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయని తాను కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్టు ఆదినారాయణ రెడ్డి తెలిపారు. ఈ క్రమంలోని వైసీపీ నేతలకు సీఎం రమేష్ మద్దతు ఉందని ఆయన పరోక్షంగా చెప్పగానే చెప్పారు. ఎక్కడో ఉన్నోడికి ఇక్కడేం పని అంటూ ఆయన పరోక్షంగా సీఎం రమేష్ నిలదీశారు.. మరి వీరిద్దరు వివాదం ఎలా మలుపులు తిరుగుతుందో చూడాలి.
ఈ వాట్సాప్ నెంబర్తో సమస్య మీది.. పరిష్కారం మాది..
అవినీతి అయినా.. లంచాలైనా.. రాజకీయ నాయకులు పెట్టే ఇబ్బందులు అయినా మీ సమస్యను మా సమస్యగా భుజాన వేసుకుంటాం. నేతలు పట్టించుకోవడం లేదని.. అధికారులు దురుసుగా వ్యవహరిస్తున్నారని చింతించాల్సిన అవసరమే లేదు. రండి.. చేయి చేయి కలుపుదాం.. మీ చింత తీర్చుదాం. మీ సమస్య ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.. పరిష్కార మార్గాన్ని పొందండి.
నోట్ : వ్యక్తిగత, కుటుంబ సమస్యలు వద్దు