ఏపీలో ఇప్పుడు కంప్లయింట్ వార్ నడుస్తోంది. వైసీపీ అక్రమాలకు పాల్పడుతోందని టీడీపీ.. లేదు.. టీడీపీయే అక్రమాలకు పాల్పడుతోందని వైసీపీ కేసులు పెట్టుకుంటున్నారు. తాజాగా తెలుగుదేశంలోకి కొత్తగా వచ్చిన నటి దివ్యవాణి ఇప్పుడు ఏకంగా జగన్ పై కేసు పెట్టింది.
ఇటీవల ఈమెకు పార్టీ అధికార ప్రతినిధి హోదా ఇచ్చారు. పాపం.. దివ్యవాణికి ఎవరు ఐడియా ఇచ్చారో కానీ.. సాక్షి పత్రికలో వస్తున్న ఇంటర్వ్యూలపై ఆమె కంప్లయింట్ ఇచ్చారు. వైఎస్ జగన్ పైనా మరియు సాక్షి దినపత్రికపైనా టీడీపీ అధికార ప్రతినిధి ఏపీ సిఈవో గోపాలకృష్ణ ద్వివేదికి ఫిర్యాదు చేశారు.
సాక్షి పత్రికలో రిటైర్డ్ సీఎస్ అజయ్కల్లాంతో ఆర్టికల్ రాయించుకుని టీడీపీపై దుష్ప్రచారం చేస్తున్నారని దివ్యవాణి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఇంటర్వ్యూ కు 60 లక్షల టారిఫ్ అవుతుందని దివ్యవాణి అంటున్నారు. ఈ ఇంటర్వ్యూ రాయించుకుని ప్రచారం చేసుకుంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
అంతే కాదు.. సాక్షి పత్రికను పార్కులు, వీధుల్లో ఉచితంగా ఇస్తున్నారని దివ్యవాణి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో 60 లక్షలను ఎన్నికల ఖర్చు కింద జగన్ అకౌంట్లో రాయాలంటూ కోరారు. కానీ ఇవేవీ నిబంధనల కింద నిలిచే అవకాశాలు లేవు.