ఎన్నికల ఫలితాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ, ఈ నెల 25వ తేదీన ఉదయం 11 గంటలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం ఉంటుందని... తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఈ సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు. ఇక 30వ తేదీన ఏపీ సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం చేస్తారని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
ఎన్నికల ఫలితాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ, ఈ నెల 25వ తేదీన ఉదయం 11 గంటలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం ఉంటుందని... తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఈ సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు. ఇక 30వ తేదీన ఏపీ సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం చేస్తారని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
అయితే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. గురువారం సాయంత్రం గవర్నర్కు రాజీనామా పత్రాన్ని నారా చంద్రబాబు నాయుడు సమర్పించనున్నట్లు తెలుస్తోంది. రాజీనామా అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడనున్నట్లు సమాచారం.