తాను ఉద్దేశపూర్వకంగా అలా మాట్లాడలేదని, చహల్ తో ఉండే సన్నిహిత్యం వల్లే సరదా వ్యాఖ్యలు చేశానాని పేర్కొన్నాడు. తన చేసిన వ్యాఖ్యల వల్ల ఎవరినైనా నొప్పించినా, ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా క్షమించాలని కోరుతూ అప్పట్లోనే వివరణ ఇచ్చుకున్నాడు. అయితే ఆ వివాదం మళ్ళీ ఇప్పుడు తెరపైకి వచ్చింది. సామాజిక వర్గాన్ని ఉద్దేశిస్తూ..యువరాజు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ హరియాణాకు చెందిన ఓ లాయర్ హిస్సార్ పరిధిలోని హాన్సీ పోలీసు స్టేషన్లో ఆదివారం పిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదుపై లాక్డౌన్ అనంతరం విచారణ జరిపి, వీడియో ఫుటేజ్లను పరిశీలించిన హిస్సార్ పోలీసులు.. ప్రస్తుతం యువరాజ్పై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేశారు.ఓ అధికారి వెల్లడించారు ఐపిసి సెక్షన్లు 153, 153 ఏ , 295 , 505 , తో పాటు ఎస్సీ , ఎస్టీ , చట్టం లోని 3 (1) ( ఆర్ ) , 3( 1 ) ఎస్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.త్వరలోనే యువరాజ్ సింగ్ కు కోర్ట్ నుండి నోటీసులు అందనున్నాయి. అయితే ఎప్పుడో సోషల్ మీడియా లో చేసిన వ్యాఖ్యలుపై ఇప్పుడు అభ్యంతరం లేవనెత్తడం పై , యువరాజ్ సింగ్ అభిమానులు బిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ కేసు పై యువరాజ్ సింగ్ ఎలా స్పందిస్తాడో చూడాలి.