టి20 వరల్డ్ కప్ లో అధికారిక మ్యాచులు ఆడటానికి ముందు ప్రస్తుతం టీమిండియా వార్మప్ మ్యాచ్లలో మునిగి తేలుతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవలే ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టుతో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది టీమిండియా. ఇది కేవలం వార్మప్ మ్యాచ్ అయినప్పటికీ కూడా అధికారిక మ్యాచ్ లెవెల్ లో ఉత్కంఠ భరితంగా జరిగింది అని చెప్పాలి.. చివరి బంతి వరకు కూడా ఎవరు గెలుస్తారో అనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో ఉంది అని చెప్పాలి. ఇకపోతే ఈ మ్యాచ్ లో భాగంగా చివరికి ఆరు పరుగుల స్వల్ప తేడాతో అటు భారత జట్టు విజయం సాధించింది.


 చివర్లో భారత సీనియర్ బౌలర్ మహమ్మద్ షమీ వచ్చి అసమాన్యమైన బౌలింగ్ ప్రతిభతో ఆకట్టుకోవడంతో ఇక భారత జట్టుకు విజయం ఖరారు అయింది అని చెప్పాలి. అయితే ఇరు జట్లు కూడా హోరాహోరీ గా తలబడటంతో ఇక వార్మప్ మ్యాచ్లో రెండు జట్లు కూడా విజేతలే అని ఎంతోమంది కామెంట్ చేస్తూ ఉన్నారు. అయితే ప్రాక్టీస్ మ్యాచ్ లో ఓటమి  అనంతరం మీడియాతో మాట్లాడిన ఆస్ట్రేలియా కెప్టెన్ పించ్ భారత విజయనంపై తనదైన శైలిలో సెటైర్లు వేయడం భారత అభిమానులకు ఏమాత్రం నచ్చలేదు అని చెప్పాలి. ప్రాక్టీస్ మ్యాచ్లో భారత జట్టు గెలుపు పై మాట్లాడుతూ వ్యంగ్యంగా సెటైర్లు వేశాడు.


 తొలిత ప్రాక్టీస్ మ్యాచ్లో తన ఇన్నింగ్స్ ఎంతగానో సంతృప్తిని ఇచ్చింది అంటూ సొంత డబ్బా కొట్టుకున్నాడు ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ పించ్. అంతేకాదు టీమిండియా సాధించిన విజయాన్ని చులకనగా చేస్తూ మాట్లాడాడు. ప్రాక్టీస్ మ్యాచ్ లో తాము గెలిచి ఉంటే బాగుండేది అని మాట్లాడుతూనే.. ఇక వార్మప్ మ్యాచ్ లో ఆడి గెలిచినంత మాత్రాన వరల్డ్ కప్ గెలవలేము కదా అంటూ పరోక్షంగా భారత విజయాన్ని చులకనగా చేస్తూ సెటైర్ వేశాడు. అయితే ఇక ఆరోన్ పించ్ చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.. ముఖ్యంగా అతని వ్యాఖ్యలపై భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: