భారీ అంచనాల మధ్య ఓపెనర్ గా బరిలోకి దిగుతున్న కేఎల్ రాహుల్ సింగిల్ డిజిట్ స్స్కోర్ చేసి చివరికి పెవెలియన్ బాట పడుతున్నారు అని చెప్పాలి. దీంతో కేఎల్ రాహుల్ ఆట తీరు చూసిన తర్వాత.. ఎప్పటిలాగే అభిమానులు అతనికి మద్దతు పలుకుతున్న.. అటు మిగతా ప్రేక్షకులు అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైస్ కెప్టెన్ కావడం కారణంగానే అతను బాగా ఆడకపోయినా ఇంకా జట్టులో కొనసాగిస్తున్నారు అంటూ కొంతమంది విమర్శలు చేస్తుంటే... ఇలాంటి ఆటగాడిని ఇంకా ఎందుకు జట్టులో పెట్టుకున్నారు అని మరి కొంతమంది ఘాటు విమర్శలు చేస్తున్నారు.
అయితే ఇక ఇప్పుడు కేఎల్ రాహుల్ పై వస్తున్న విమర్శలు బీసీసీఐ వరకు వెళ్లాయి అన్నది తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఇటీవల భారత సెలెక్టర్లు అటు కేఎల్ రాహుల్ కు ఊహించని షాక్ ఇచ్చారు. టెస్ట్ సిరీస్ తర్వాత ఆస్ట్రేలియా తో టీమ్ ఇండియా వన్డే సిరీస్ ఆడిపోతుంది. అయితే టెస్ట్ సిరీస్ కి వైస్ కెప్టెన్ గా వ్యవహరించిన రాహుల్ ను వన్డే ఫార్మాట్లో మాత్రం ఆ బాధ్యతలనుంచి తప్పించింది బీసీసీఐ. కెప్టెన్ గా రోహిత్ శర్మను ఎంపిక చేసి వైస్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యాను నియమించింది. బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయంతో కేఎల్ రాహుల్ అభిమానులందరూ షాక్ అవుతున్నారు అని చెప్పాలి.