పోయిన సంవత్సరం జరిగిన వరల్డ్ కప్ లో ఇండియా ఫైనల్ వరకు చేరుకుంది. చివరి వరకు పోరాడి లాస్ట్ మ్యాచ్ లో ఓడిపోయిన ఇండియా రనరప్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇకపోతే మరికొన్ని రోజుల్లోనే టి20 వరల్డ్ కప్ ప్రారంభం కాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ టోర్నీ ప్రారంభం కాకముందే ఇండియా  టీమ్ కచ్చితంగా ఈ సారి టి20 వరల్డ్ కప్ ను ఇండియాకు అందిస్తుంది అని భారత దేశ క్రికెట్ అభిమానులు అంతా ఆశ భావం వ్యక్తం చేస్తున్నారు.  

టి20 వరల్డ్ కప్ జూన్ నెల నుండి ప్రారంభం కాబోతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే బీసీసీఐ చాలా వరకు కసరత్తును పూర్తి చేసింది. ఇక తాజాగా 11 మంది ప్లేయర్స్ తో లిస్టును బీసీసీఐ విడుదల చేసింది. అందులో రోహిత్ శర్మ , విరాట్ కోహ్లీ , సూర్య కుమార్ యాదవ్ , రింకు సింగ్ , హార్దిక్ పాండ్యా , జూరెల్ , రవీంద్ర జడేజా ,  సిరాజ్ ఉన్నారు. ఇలా ఈ 11 మంది తో కూడిన జాబితాను తాజాగా బీసీసీఐ విడుదల చేసింది.

ఇకపోతే ప్రస్తుతం ఇండియాలో ఐపీఎల్ ప్రీమియర్ లీగ్ ఎంతో రసవత్తరంగా ముందుకు సాగుతుంది. దానితో ప్రస్తుతం ప్లేయర్ లంతా ఐపీఎల్ పైనే పూర్తి స్థాయి దృష్టిని సారించారు. ఇక ఎప్పుడు అయితే ఐపీఎల్ పూర్తి స్థాయిలో ముగుస్తుందో ఆ తర్వాత నుండి ఇండియన్ క్రికెట్ టీం నెక్స్ట్ స్టార్ట్ కాబోయే టి20 వరల్డ్ కప్ కు సన్నద్ధం కాబోతోంది. ఇకపోతే ఇప్పటి వరకు ఇండియా ఒక్క సారి మాత్రమే టి20 వరల్డ్ కప్పును దక్కించుకుంది. మరి ఈ సారితో రెండవ సారి కూడా టి2 0 వరల్డ్ కప్ ఇండియా సాధిస్తుంది అని చాలా మంది ఇండియన్ అభిమానులు ఆశ భావం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సారి ఏమవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

tt