ఒకప్పుడు వరుస చిత్రాలతో ఒక ఊపు ఊపిన హీరోయిన్ రోజా గారు ఆ తర్వాత పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా కీలక పాత్ర పోషిస్తూ రాణిస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఇటు జబర్దస్త్ తోను ఈమె టైం ను యంగేజ్ చేస్తున్నారు. జబర్దస్త్ లో ఒక జడ్జిగా గత 11 ఏళ్ల నుండి కొనసాగుతున్నారు. ఈ షోతో తనకి విడ దీయలేని బంధం ఏర్పడింది. ఓ వైపు తనకు ఇష్టమైన టెలివిజన్ షోని కంటిన్యూ చేస్తూనే మరో వైపు ఓ ఎమ్మెల్యే బాధ్యత గల నేతగా తన రాజకీయ పనుల్లో చురుగ్గా ఉంటారు. అయితే ఈ మధ్య కాలంలో ఈమె జగన్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి రాజకీయాల్లో బాగా బిజీ అయిన సంగతి తెలిసిందే .

కాగా ఇపుడు పాలిటిక్స్ లో మరి టైట్ షెడ్యుల్ కావడంతో జబర్దస్త్ షో కి గుడ్ బాయ్ చెప్పాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అనుకోవడం కాదట ఇప్పటికే జబర్దస్త్ యాజమాన్యాన్ని కలిసి మరి ఈ విషయాన్ని చెప్పి తనకు ఇంతకాలం షోలో భాగమైనందుకు ఎంతో సంతోషంగా ఉందని అలాంటి అవకాశం ఇచ్చినందుకు మల్లెమాల యాజమాన్యానికి తాను ఎప్పుడూ కృతజ్ఞురాలినై ఉంటానని తెలియచేసి సెలవు తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. కొందరు ఇండస్ట్రీకి సంబంధించిన వారు ఈ విషయాన్ని నిజమని అంటున్నారు. ఇప్పటికే కొన్ని ఎపిసోడ్స్ షూటింగ్ జరిగి పోయి ఉండడంతో ఇంకో రెండు వారాల తరవాత రాబోయే ఎపిసోడ్ నుండి రోజా సెల్వమణి కనిపించరు అని తెలుస్తోంది .

అయితే ప్రస్తుతానికి రోజా గారి జడ్జి ప్లేస్ ఎవరు భర్తీ చేయలేదని మరో జడ్జి కోసం చూస్తున్నారని అప్పటి వరకు జబర్దస్త్ షోకు మనో గారు మాత్రమే సింగిల్ జడ్జిగా వ్యవహరిస్తారని సమాచారం. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియదు ...

మరింత సమాచారం తెలుసుకోండి: