జియో ఎప్పటికప్పుడు వినూత్న ప్లాన్ లతో కస్టమర్లను ఆకర్షిస్తోంది. జియో ఇచ్చే సరికొత్త ఆఫర్లతో తక్కువ అమౌంట్ కి ఎక్కువ డేటా కూడా అందుతుంది.అంతేకాకుండా జియో టు జియో ఫ్రీ కాల్స్ ను కూడా అందిస్తోంది. ఇప్పుడు టెలికాం రంగం లోనే మరో సరికొత్త వినూత్నమైన ప్లాన్ తో మన ముందుకు వచ్చింది జియో. ఆ ఆఫర్ ప్లాన్ ఏమిటో ఇప్పుడు చూద్దాం.

ప్రస్తుతం కరోనా కారణంగా అందరూ వర్క్ ఫ్రం హోం మీద ఆధార పడుతున్నారు. అలాంటి వారికోసం ఎక్కువ డేటా వినియోగం అవసరమవుతుంది. ఇప్పుడు జియో ప్రవేశపెట్టిన సరికొత్త ఆఫర్ వర్క్ ఫ్రొం హోమ్ కస్టమర్లకు బాగా ఉపయోగపడుతుందని జియో  సంస్థ వారు చెప్తున్నారు.రూ.444 ప్లాన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.ఇక మిగిలిన టెలికామ్ రంగాల కంటే జియో ప్రవేశపెట్టిన సరికొత్త ప్లాన్ ఎంతో బాగుంటుందని అందరూ అంచనా వేస్తారు. ఇక ఆ ప్లాన్ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

సరికొత్త జియో ప్లాన్ విలువ రూ.444. 56 రోజులు వ్యాలిడిటీ వస్తుంది.అంతేకాకుండా రోజుకు  2 జీ బీ  చొప్పున మొత్తం 56 రోజులకు  గాను  112 జీ బీ  ని అందిస్తుంది. ఇక ఒకవేళ మీకు రోజువారీ డేటా కానీ, మొత్తం డేటా కానీ అయిపోతే 64 కే బీ పీ ఎస్ వేగంతో మీరు ఇంటర్నెట్ డేటాను వాడుకోవచ్చు. అంతేకాకుండా జియోకు సంబంధించిన అన్ని యాప్ లను ఉచితంగా వాడుకొనే సదుపాయం ఈ ప్లాన్ ద్వారా పొందవచ్చు.

అంతేకాకుండా అన్లిమిటెడ్ జియో కాల్స్ మీకు 56 రోజుల పాటు అందుబాటులో ఉంటాయి. ఇక వర్క్ ఫ్రం హోం చేసుకునే కస్టమర్లకు ఈ ఆఫర్ చాలా మంచిగా పని చేస్తుందని చెప్పవచ్చు.ఇక అన్ని టెలికామ్ రంగాలతో పోలిస్తే జియో ప్రవేశపెట్టిన సరికొత్త రూ.444 ప్యాక్ ప్లాన్ చాలా బాగుంది అంటూ కస్టమర్లు ఎగబడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: