ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్నది వైసీపీ.. మరి అధికారంలో ఉన్న పార్టీ నాయకులే అవినీతి పెరిగిపోయిందని మాట్లాడితే ఎలా ఉంటుంది.. విజయనగరం జిల్లాలో అదే జరుగుతోంది. విజయనగరం జిల్లా చీపురుపల్లి గ్రామీణ విద్యుత్‌ సహకార సంఘం లిమిటెడ్‌లో అవినీతి రాజ్యమేలుతోందని సాక్షాత్తూ సొంత పార్టీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ మండిపడుతున్నారు.

చీపురుపల్లి ఆర్ఈసీఎస్‌లో అవినీతి రాజ్యమేలుతోందన్న ఎంపీ బెల్లాన... అక్కడ ఎండీ రమేష్ ఉన్నంతవరకు ఆర్ఈసీఎస్‌కు మనుగడ లేదని మండిపడ్డారు. ఆర్ఈసీఎస్ అవినీతిపై గతంలో మేమే ధర్నాలు చేశామని ఎంపీ బెల్లాన అంటున్నారు. మరి అధికారులు ఇప్పుడు ఎందుకు ఉపేక్షిస్తున్నారో అర్థంకావట్లేదంటున్న ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌.. జిల్లా సమీక్ష సమావేశంలో దీని సంగతి తేలుస్తానంటూ రంకెలు వేస్తున్నారు. మరి ఇలా సొంత పార్టీ నేతలే అవినీతి అవినీతి అంటూ రచ్చకెక్కితే పార్టీ పరువు పోదా అన్న అనుమానమూ రావచ్చు.. కానీ ఇదంతా గత ప్రభుత్వ అవినీతి అంటూ సర్దిచెప్పే అవకాశం కూడా ఉంది. మరి బెల్లాన కామెంట్లు విజయనగరం రాజకీయంలో ఎలాంటి ప్రకంపనలు తీసుకొస్తాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

YCP