రాజస్థాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉంది అనే వార్తల నేపధ్యంలో కాంగ్రెస్ కీలక నేత, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలెట్ కీలక ప్రకటన చేసారు. తాను కాంగ్రెస్ ని వీడటం లేదు అని బిజెపిలో చేరడం లేదు అని ఆయన స్పష్టం చేసారు. ఆయన బిజెపిలో చేరే అవకాశం ఉంది అని బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డా తో సమావేశం అయ్యే అవకాశం ఉందనే వార్తలు వచ్చాయి.
అనూహ్యంగా తాను బిజెపిలో చేరడం లేదన్నారు ఆయన. కాగా తనకు 30 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని సిఎం అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉందనే ప్రకటనలు ఆయన చేసారు . మరి ఇప్పుడు అయన ఎం చేస్తారు అనేది సర్వత్రా ఆసక్తిగా ఉంది.