అమరావతి రాజధాని గ్రామాల రైతులు, మహిళల నిరసనలు 310 వ రోజుకి చేరుకున్నాయి. అమరావతికి శంకుస్థాపన జరిగి నేటికీ ఐదేళ్లు ఆయింది. ఐదేళ్ల క్రితం ఉద్ధండ రాయుని పాలెంలో అమరావతి కి ప్రధాని మోడి శంకుస్థాపన చేసారు. శంకుస్థాపనకు గుర్తుగా నేడు రాజధాని రైతులు, మహిళల వినూత్న నిరసనలు చేయనున్నారు. అమరావతి-నాటి వైభవం-నేటి దుస్థితి పేరుతో శంకుస్థాపన ప్రాంతం వద్ద ఉదయం నుండి సాయంత్రం వరకు నిరసన చేయనున్నారు.

ఉదయం 9 గంటలకు రాయపూడి, మందడం నుంచి పాదయాత్ర గా శంకుస్థాపన జరిగిన ప్రదేశానికి చేరుకోనున్న రాజధాని గ్రామాల రైతులు, మహిళలు... ఉదయం 10.30 గంటలకు ఉద్దండరాయునిపాలెంలో సర్వమత ప్రార్థనలు చేస్తారు. అమరావతి చూపు-మోడి వైపు పేరుతో వినూత్న ప్రదర్శన చేయనున్నారు. రాత్రి కి దీక్షా శిబిరాల వద్ద అమరావతి వెలుగు పేరుతో కాగడాల ప్రదర్శన చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: