ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం మాత్రం ఎక్కడా కూడా వెనక్కు తగ్గడం లేదు. ఏపీ సర్కార్ వద్దు అని చెప్తున్నా సరే ఎన్నికల సంఘం మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ మీదనే ఎక్కువగా ఫోకస్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. దీనిపై ఇప్పుడు తీవ్ర స్థాయిలో ఏపీ సర్కార్ ఆగ్రహంగా ఉంది. ఇక ఇదిలా ఉంటే ఏపీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్... ఏపీ సర్కార్ కి లేఖ రాసారు.

సీఎస్‌ నీలం సాహ్నీకి ఎస్‌ఈసీ నిమ్మగడ్డ మరో లేఖ రాసారు. కోర్టు తీర్పు కాపీని లేఖకు జతచేసి ఆయన లేఖ రాసారు. రాజ్యాంగ బద్ధ సంస్థలకు ప్రభుత్వం సహకరించాలని హైకోర్టు తీర్పు ఇచ్చిందని, ప్రభుత్వ సహకారంపై తమకు మళ్లీ నివేదిక సమర్పించాలని తీర్పులో ఎన్నికల కమిషన్‌ను ధర్మాసనం ఆదేశించిన విషయాన్ని ఆయన లేఖలో రాసుకొచ్చారు. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని భావిస్తున్నామని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: