పుణెలో ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న ఓ ప్లాంట్ను కొవాగ్జిన్ తయారీకి ఉపయోగించుకునేందుకు భారత్ బయోటెక్ సంస్థకు బాంబే హైకోర్టు అనుమతించింది. కర్ణాటక కేంద్రంగా పనిచేసే బయోవెట్ దాఖలు చేసిన పిటిషన్పై బాంబే హైకోర్టు డివిజన్ బెంచ్ మే 6న వాదనలు ఆలకించి.. ఈ మేరకు తీర్పు చెప్పింది. తయారీ కేంద్రం ఉన్న ప్రాంతాన్ని 1973లో మహారాష్ట్ర సర్కారు ఇంటర్వెట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు కేటాయించింది. ఇక్కడ ఎఫ్ఎండీ(ఫుట్ అండ్ మౌత్ డిసీజ్) టీకాలను తయారు చేస్తోంది ఈ సంస్థ. ఈ క్రమంలో బయోవెట్ సంస్థ బాంబే హైకోర్టును ఆశ్రయించి.. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యాజ్యం దాఖలు చేసి.. కొవాగ్జిన్తో పాటు ఎఫ్ఎండీ టీకాను తయారు చేసేందుకు ఖాళీగా ఉన్న ఈ ప్లాంట్ను ఉపయోగించుకునే అనుమతులు ఇప్పించాలని కోరింది. తాజాగా దీనిపై బయోవెట్కు అనుకూలంగా తీర్పు వచ్చింది. 12 హెక్టార్లను స్థలాన్ని వినియోగించుకునేందుకు సైతం కోర్టు అనుమతులు ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: