పహల్గాంలో జరిగిన దాడికి భారత్, పాకిస్తాన్ పై ప్రతీకారం తీర్చుకున్న విషయం తెలిసిందే. పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై భారత్ దాడులకు దిగింది. కాశ్మీర్ పీవోకే లో భారత సైన్యం దాడులు నిర్వహించింది. ఈ దాడులను "ఆపరేషన్ సింధూర్" పేరుతో భారత్ ప్రభుత్వం మొదలుపెట్టింది.  పాకిస్తాన్ లోని కోట్లీ, మురిడ్కే, బహవల్పూర్‌, ముజఫరాబాద్‌ ప్రాంతాల్లో దాడులు చేసినట్లు భారత్ అధికారికంగా ప్రకటించింది. ఈ దాడికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అయ్యాయి. ఆ తర్వాత పాకిస్తాన్ ఆర్మీ దాడులకు దిగింది. పాకిస్తాన్ ఆర్మీ పూంఛ్, రాజౌరి సెక్టార్లలో కాల్పులు మొదలుపెట్టింది. భారత్ కూడా దాడులు చేసింది. ఇటు భారత్, అటు పాకిస్తాన్ ఇరుదేశాల సైనికులు కాల్పులు జరిపాయి. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మరో పన్నాగం పన్నుతున్నట్లు తెలుస్తోంది. భారత్ పై మరోసారి దాడి చేయనున్నట్లు సమాచారం. భారత సైనికులు ప్రయాణించే రైళ్లను టార్గెట్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మిలిటరీ రైళ్లపైనే పాకిస్తాన్ పూర్తి నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో రైల్వే శాఖ అందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. అలాగే భద్రత కోసం ఉద్యోగులకు అడ్వైజరీని కూడా జారీ చేసింది.

ఇక పాక్ పై జరుగుతున్న దాడులకు పాకిస్తాన్ ప్రధాని షహబాబ్ షరీఫ్ స్పందించారు. పాకిస్తాన్ భారత్ పై చర్యలు కచ్చితంగా తీసుకుంటుందని తెలిపారు. భారతదేశం పాకిస్తాన్ కి ఎప్పుడు శత్రువేనని అన్నారు. పాకిస్తాన్ భారత్ ని వదిలిపెట్టదని కచ్చితంగా బదులు తీర్చుకుంటుందని పాక్ ప్రధాని చెప్పుకొచ్చారు. పాక్ సైన్యం వెంట దేశమంతా నిలబడి ఉందని వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: