ముఖ్యంగా విద్యార్థులు అయితే క్షణికావేషంలో తీసుకుంటున్న నిర్ణయాలు ఏకంగా పిల్లలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు తీరని శోఖాన్ని మిగులుస్తూ ఉన్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. తమ పిల్లలు బాగా చదువుకుంటారని.. ప్రయోజకులు అవతారని తల్లిదండ్రులు నమ్మకం పెట్టుకుంటే.. అటు ఎంతో మంది విద్యార్థులు తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేస్తూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగు చూసింది.
మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల లో అడవుల్లో పురుగుమందు తాగి ఓ యువకుడు చనిపోయిన ఘటన వెలుగు చూసింది. చిన్న శంకరంపేట మండలం చందంపేట గ్రామానికి చెందిన శ్రీకాంత్ అనే 21 యువకుడు తోర్నాల బీసీ హాస్టల్ లో ఉంటూ సిద్దిపేట డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అయితే చదువుపై శ్రద్ధ చూపాలని తండ్రి ఇటీవల శ్రీకాంత్ ని కాస్త మందులించాడు. దీంతో ఎంతో మనస్తాపం చెందాడు శ్రీకాంత్. చివరికి ఆత్మహత్య చేసుకోవాలని కఠిన నిర్ణయం తీసుకొని ఏడుపాయల అడవుల్లో పురుగుల మందు తాగి చనిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.