ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లు, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే విద్యాసంస్థల్లో 2017-18 విద్యా సంవత్సరం ప్రవేశాల కోసం జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ)-2017 షెడ్యూలు అక్టోబర్ 13న విడుదలైంది. ఈ మేరకు మద్రాసు ఐఐటీ జేఈఈ అడ్వాన్స్డ్-2017 వెబ్సైట్ (jeeadv.ac.in)ను అందుబాటులోకి తెచ్చింది. ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, ఇతర విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్ పరీక్ష షెడ్యూల్ను కూడా వెల్లడించింది.