ఇంటర్ విద్యార్థులకు శుభవార్త తెలిపింది ప్రభుత్వం.. తమ వార్షిక పరీక్షలలో ప్రశ్నల స్థాయి ఎక్కువగా రెట్టింపు చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రశ్నల సంఖ్య కూడా గణనీయంగా పెంచడం జరిగిందట.. గతంలో కూడా కేవలం కొన్ని ప్రశ్నలలో మాత్రమే చాయిస్ ప్రశ్నలు ఉండేవి.. కానీ ఈ ఏడాది అన్ని సెక్షన్లలో ప్రశ్నలను పెంచి.. ఛాయిస్ కింద కొన్ని ప్రశ్నలను వదులుకొని అవకాశాన్ని విద్యార్థులకు కల్పించారు. 2021-2022 సంవత్సరానికి గాను తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాష విద్యార్థులకు మాదిరే ఈ ప్రశ్నపత్రాలను ఇంటర్ బోర్డు సంబంధించిన అధికారులు ఆయా వెబ్సైట్లలో పెట్టడం జరిగింది. గత సంవత్సరం మూడు సెక్షన్ల గాను కేవలం 50 శాతం మాత్రమే ప్రశ్నలు ఇచ్చేవారట.

అయితే ఇప్పుడు ఈ మూడు సెక్షన్ల లో చాయిస్ ప్రశ్నలు ఇవ్వడం జరుగుతోంది. ప్రస్తుతం ఇంటర్ మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం విద్యార్థులు..ssc లోనే పరీక్షలు రాయకుండానే ఉత్తీర్ణులయ్యారు.. పైగా గత సంవత్సరం నిర్వహించిన పరీక్షలలో ఎక్కువ మంది ఫెయిల్ కావడంతో.. ఈ చాయిస్ ప్రశ్నలు పెంచడం జరిగిందట. అయితే ప్రశ్నాపత్రాలు పేపర్ల వారీగా ఎలా ఉండబోతున్నాయి.

1). గణితం సెక్షన్ -A లో కేవలం 15 ప్రశ్నలకు గాను 10 సమాధానాలు రాయాల్సి ఉండేది. ఐదు ప్రశ్నలు ఛాయిస్ కింద వదులుకోవచ్చు.

గత సంవత్సరం మాత్రం ఈ సెక్షన్లో ప్రశ్నలన్నిటికీ ఆన్సర్లు రాయవలసి ఉండేది.. అయితే సెక్షన్ -B లో మాత్రం 5 సమాధానాలు రాయాలి.6 ప్రశ్నలను వదిలేయవచ్చు. ఇక సెక్షన్ -c లో మొత్తం తొమ్మిది ప్రశ్నలు ఉండేవి.

2). అర్థశాస్త్రం సెక్షన్-A లో 7 ప్రశ్నలకు 3 సమాధానాలు రాయాలి..4 శ్రీరెడ్డి ప్రశ్నలు ఛాయిస్ కింద వదిలేయవచ్చు.. ఇక సెక్షన్ -B లో 17 ప్రశ్నలకు గాను  ఎనిమిది ప్రశ్నలకు సమాధానం రాయవలసి ఉంటుంది.9 ప్రశ్నలను ఛాయిస్ కింద వదిలి పెట్ట వచ్చు. ఇక సెక్షన్ -c లో 15 ప్రశ్నలకు సమాధానం రాయవలసి ఉంటుంది.. అందులో మొత్తం 24 ప్రశ్నలను ఉంటాయి. ఇక ఇందులో 9  ప్రశ్నలను వదిలి వేయవలసి ఉంటుంది. అలాగే ఇంగ్లీష్ లో కూడా ఇలాంటివి ఉన్నాయి.ఇంకా పూర్తి సమాచారం కావాలంటే ఆయా వెబ్ సైట్లకు వెళ్లి పూర్తి వివరాలను చూసుకోవడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: