ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఖాతాదారులకి త్వరలో మంచి శుభవార్త ను అందించనుంది. ఇక వెలువడుతున్న సమాచారం ప్రకారం కనీస పెన్షన్ మూడు రెట్లు అధికంగా పెరిగే అవకాశం ఉంటుందట. ఇక ఈపీఎఫ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్ట్ ల సమావేశం వచ్చే నెలలో జరుగుతుంది అని నివేదికలో పేర్కొనడం జరిగింది. ఇకపోతే కనీస పెన్షన్ మూడు రెట్లు పెంచే విధంగా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉందట. కనీస పెన్షన్ ప్రస్తుతం రూ.1000 నుంచీ రూ.3000 కి పెంచవచ్చు. లేబర్ సెక్రటరీ నేతృత్వంలో ఉన్న కమిటీ ఈ విషయంలో తన నివేదికను త్వరలోనే సమర్పించనుంది. ఈ నిర్ణయం దాదాపు 6.5 లక్షల మంది పెన్షనర్లు.. రూ.5 కోట్ల ఈపీఎఫ్ఓ చందాదారులకు ప్రయోజనం చేకూరుతుంది.


ఇకపోతే దీనితోపాటు సీ బీ టీ ఈక్విటీ పరిమితిని 15 శాతం నుంచి 25 శాతానికి పెంచడం పై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఇటీవల ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సబ్స్క్రైబర్లు షాక్ ఇస్తూ ఆర్థిక మంత్రిత్వ శాఖ 2021- 2022 సంవత్సరానికి గాను 8.1 శాతం వడ్డీ రేట్లను ప్రకటించింది. ఇక  4 దశాబ్దాల కనిష్ఠ స్థాయి 2020 - 2021 ఆర్థిక సంవత్సరానికి గాను ఈపీఎఫ్ వడ్డీ రేట్లు 8.5 శాతంగా ఉండేది. ఇక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఏకంగా 65 మిలియన్ల మంది ఖాతాదారులు నిరాశ చెందారు అని చెప్పవచ్చు.


ఈక్విటీల్లో పెట్టుబడి ని పెంచడం ద్వారా రాబడిని పొందడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రతిపాదన మీరు పరిశీలించడానికి రెండు వారాల క్రితమే ఫైనాన్స్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఆడిట్ కమిటీ ముఖ్యమై న సమావేశాన్ని కూడా జరిగింది. ఈ కమిటీ సమర్పించే ప్రతిపాదన ఈపీఎఫ్ సెంట్రల్ బాడీ ఆఫ్ ట్రస్ట్ ల నందు సమర్పించబడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: