యంగ్ హీరో శర్వానంద్ ఫుల్ జోష్ మీద ఉన్నాడు. వరుసగా సినిమాలను ఒకే చేస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తున్నాడు. శర్వానంద్ హీరోగా వస్తోన్న తాజా చిత్రం ‘శ్రీకారం’. ఇక శర్వానంద్ అజయ్ భూపతితో 'మహాసముద్రం' అనే సినిమాను కూడా చేస్తున్నాడు. అలాగే తిరుమల కిషోర్ దర్శకత్వంలో 'ఆడాళ్ళు మీకు జోహార్లు' అనే సినిమా కూడా చేస్తున్నాడు.

ప్రసుత్తం శర్వానంద్ నటిస్తున్న శ్రీకారం సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్. కిశోర్ బి దర్శకత్వం వహించారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం సమకూరుస్తున్నారు. సాయిమాధవ్ బుర్రా సంభాషణలు రాశారు. జె.యువరాజ్ సినిమాటోగ్రఫీ అందించారు. ఇటీవలే తిరుపతిలో ఒక షెడ్యూల్‌ను చిత్ర యూనిట్ పూర్తి చేసుకుంది.



తాజాగా ఈ సినిమానుంచి 'భలేగుంది బాల' అనే సాంగ్ అనే లిరికల్ సాంగ్ ను విడుదల చేయనున్నారు. ఈ సాంగ్ కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఫుల్ లిరికల్ సాంగ్ ను నవంబర్ 9న విడుదల చేయనున్నారు. భలేగుంది బాలా’ అంటూ సాగే ఈ పాటను రాయలసీమకు చెందిన రచయిత, జానపద గాయకుడు పెంచల్ దాస్ ఆలపించారు. ఆయనే స్వయంగా సాహిత్యం అందించారు.

ఈ మేరకు గురువారం సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమోలో హీరోయిన్ ప్రియాంక ట్రాలీ బ్యాగ్ పట్టుకుని నడుకుంటూ వెళ్తుండగా.. ఆమె వెనుక నుంచి ‘వస్తానంటివో పోతానంటివో ఓ వగలు ఒలుకుతావే.. కట్టమిందబొయ్యే అలకల చిలక భలేగుంది బాలా’ అంటూ శర్వానంద్ పాట అందుకున్నారు. ఈ పాటలో శర్వానంద్ లుంగీతో పల్లెటూరి కుర్రాడిలా కనిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: