అలా మన టాలీవుడ్ లోని నటీనటులు డిజిటల్ మీడియాలో ఒక ఇంటర్వ్యూ కి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం. ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో తో సుడిగాలి సుదీర్ బుల్లి తెరకు పరిచయం కాగా ఆయన ఏదైనా యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వాలంటే ముప్పై వేలు తీసుకుంటారు. కనీసం పాతిక వేలు ఇవ్వనిదే ఆయన యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వరట. హైపర్ ఆది 15వేల నుంచి 20వేల వరకు పారితోషికం తీసుకొని ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒప్పుకుంటారట. గెటప్ శీను కూడా ఇదే ధరను డిమాండ్ చేస్తాడని తెలుస్తోంది. ఆటో రాంప్రసాద్ , ముక్కు అవినాష్ , బుల్లెట్ భాస్కర్, నరేష్, చంటి తదితరులు ఇంటర్వ్యూలు ఇవ్వాలంటే కనీసం పదివేలైన ఇవ్వాలట.
ఇక సైడ్ పాత్రలు చేసే మధ్య వయసు నటీమణులు కూడా యూట్యూబ్ లలో ఇంటర్వ్యూ లు ఇవ్వాలంటే రెమ్యునరేషన్ ఇవ్వాల్సిందేనట. సురేఖ వాణి, హేమ, ప్రగతి వంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ లకు మంచి డిమాండ్ ఉండడంతో వారికి వ్యూస్ ఎక్కువగా వస్తాయనే ఉద్దేశ్యంతో ఛానల్ నిర్వాహకులు కూడా వారికి పారితోషకాన్ని ఇవ్వడానికి ఒప్పుకుంటారు. వీరికి ఒక్కొక్కరికి దాదాపు ఇరవై వేలకు పైగానే రెమ్యునరేషన్ ఇవ్వడానికి రెడీ గా ఉంటారట. ఇక బుల్లితెర యాంకర్ లు వర్షిణి, అనసూయ, రష్మీ లాంటి వారికి దాదాపు యాభైవేల వరకు రెమ్యునరేషన్ ఉంటుందట..