ఇప్పుడు ఎక్కడ చూసిన ఒక్కటే అంశం హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో ఇదే విషయం ట్రేండింగ్ లో ఉంటూ చర్చనియాంశంగా మారింది. బిగ్ బాస్ సీజన్ 5 కి మరి కొన్ని రోజుల్లో ఎండ్ కార్డ్ పడనుంది. ఈ క్రమంలో లోపల ఉన్న హౌస్ మేట్స్ కి బయట ఉన్న ఇంటి సభ్యులు, ఫ్యాన్స్ ,తెలిసిన వాళ్లు, సెలబ్రిటీలు.. ఎవరికి తోచిన విధంగా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా సన్నీ-షన్ను మధ్య టఫ్ కాంపిటీషన్ ఉండబోతున్నట్లు తెలుస్తుంది.

అయితే బిగ్ బాస్ హౌస్ లో షణ్ముఖ్-సిరి బిహేవియర్ పైన సోషల్ మీడియాలో వస్తున్న ట్రోలింగ్ అంతా ఇంతా కాదు. మాటలాడితే హగ్గులు..ఇంకొంచెం ముందుకెళ్తే ముద్దులు..వాళ్ళు ఫ్రెండ్స్ నే కానీ చూసేవాళ్లకి అలా అనిపించడంలేదు. ఇదివరకే బయట  వాళ్ళు వేరే వ్యక్తులతో ప్రేమలో ఉన్నారు పెళ్ళి చేసుకోవడానికి రెడీ అవుతున్నారు..కానీ ఇలా బిహేవ్ చేయడం నచ్చడంలేదు. ఇదే విషయాని సిరి వాళ్ళ అమ్మ కూడా చెప్పింది..కానీ ఆ విషయాని కూడా వదిలేసి ఇద్దరు రెచ్చిపోతున్నారు.

ఇక రీసెంట్ గా సిరి తో షన్ను మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. ఆమె పై అరుస్తూ.. కోపడుతూ ఆమెనే టార్గెట్ చేసిన విధంగా ఉన్నాయి. దీంతో నటి మాధవి లత సిరి కి సపోర్ట్ చేస్తూ..బిగ్ బాస్ టీ ను కడిగిపారేసింది. అసలు మీకు సిగ్గు అనేది ఉందా అంటూ  రెచ్చిపోయింది. సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.."ఏమయ్యా బిగ్ బాస్.. అసలు నీకు సిగ్గుందా. సిగ్గులేని టీమ్‌ మీది..  హౌస్ లో ఏంటీ ఆ అరాచకాలు. ఒక ఆడపిల్లను ఇలా బానిసను చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారా. అసలు నవ్వకూడదు- ఏడ్వకూడదు- వంగకూడదు. ఇలా  మానసిక ఆత్యాచారం చేస్తుంటే ఎలా ఉందో తెలుసా..వాడు ఎవడో పెళ్లాన్ని ఇంకోకడు డామినేట్ చేసిన్నట్లు.. శని,ఆదివారల్లో ఊపుకుంటూ వచ్చిన మా నాగ్ మావ.. అరె ఎంట్రా ఇది అంటూ వగలు పొస్తారు. అలాంటి యాదవలకు బిగ్ బాస్ లో ప్లేస్ ఎలా ఇచ్చావు... ఇక వాడికే కప్ కూడా తగలబెట్టి.. ఆ తరువాత  మీ బిగ్ బాస్ సెట్ ని కూడా తగలబెట్టుకోండీ.." అంటూ ఘాటుగా స్పందించింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: