స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా తెరకెక్కిన లేటెస్ట్ సినిమా పుష్ప పార్ట్ 1. సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్ బ్యానర్ పై ఎంతో భారీ ఎత్తున తెరకెక్కిన ఈ పాన్ ఇండియా మూవీ నేడు ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్, సాంగ్స్, టీజర్, పోస్టర్స్ అన్నిటికీ కూడా అందరి నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇప్పటికే అలవైకుంఠపురములో మూవీ తో భారీ సక్సెస్ కొట్టిన అల్లు అర్జున్ నుండి వస్తున్న మూవీ కావడంతో ఆయన ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా పుష్ప పై ఎంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఎట్టకేలకు నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప సినిమా మంచి టాక్ ని సొంతం చేసుకుంది. సుకుమార్ మరొక్కమారు తన మార్క్ టాలెంట్ తో సినిమాని తెరకెక్కించారని, అక్కడక్కడా మధ్యలో కొద్దిపాటి ల్యాగ్స్ ఉన్నప్పటికీ పుష్ప ఓవరాల్ గా పుష్ప ఆకట్టుకుంటుందని అంటున్నారు ప్రేక్షకాభిమానులు.

ముఖ్యంగా సినిమాలో పుష్పరాజ్ అనే మాస్ పాత్రలో అల్లు అర్జున్ యాక్టింగ్ అయితే అదిరిపోయిందని, శ్రీవల్లి గా రష్మిక, ఇక ఇతర పాత్ర చేసిన అనసూయ, సునీల్, ధనుంజయ, రావు రమేష్, ఫహాద్ ఫాసిల్ వంటి వారు కూడా తమ తమ పాత్రల్లో ఒదిగిపోయి నటించారని అంటున్నారు. ఇక దేవిశ్రీప్రసాద్ అందించిన సాంగ్స్ ఇప్పటికే మంచి పాపులర్ కాగా అవి థియేటర్స్ లో విజువల్ గా కూడా ఆకట్టుకున్నాయని, అలానే ఆయన అందించిన బీజీఎమ్ కూడా బాగుందని చెప్తున్నారు. భారీ యాక్షన్ సీన్స్, ఫైట్స్ తో పాటు నిర్మాణ పరంగా కూడా అందరినీ అలరిస్తూ తగ్గేదేలే అనే రీతిలో పుష్ప పార్ట్ 1 మూవీ మొత్తంగా మంచి టాక్ ని సొంతం చేసుకోవడంతో పుష్ప టీమ్ తో పాటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: