టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ కి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ యంగ్ హీరో లేటెస్ట్ మూవీ అప్డేట్ వచ్చేసింది. విశ్వక్ సేన్ చిత్రం "అశోకవనంలో అర్జున కళ్యాణం" మూవీ టీజర్ వచ్చేసింది. ఈ సినిమాలో హీరో, అలాగే వారి కుటుంబ సభ్యులు వధువు కోసం వెతుకుతుంటారు. చివరికి పసుపులేటి మాధవి రుక్షర్ ధిల్లాన్ తో అర్జున్ వివాహం నిశ్చయమవుతుంది. గోదావరి బ్యాక్‌ డ్రాప్‌లో కనిపించిన ఈ అందమైన ట్రెయిలర్ ఆసక్తికరంగా వీక్షకుల హృదయాలను ఆకట్టుకుంటోంది. ఈ ట్రైలర్ లో విశ్వక్ సేన్ గెటప్, డైలాగ్స్, ఎక్స్ప్రెషన్స్ అన్నీ సినిమాపై అంచనాలను బాగా పెంచాయి.

ఒక క్లీన్ ఫుల్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా మన ముందుకు రాబోతోందని అర్దం అవుతోంది. అదే విధంగా ట్రెయిలర్ లో హీరో చెప్పిన డైలాగ్  ‘తాగితే గాని మా బ్రతుకులకు ఏడుపురాదు… తాగినోడి ఏడుపుకేమో వాల్యూవే లేదు ’ అన్న డైలాగ్  కు వీక్షకులు ఫిదా అవుతున్నారు. యూత్ అయితే సత్యం చెప్పావు బ్రో అంటూ కామెంట్లు పెడుతూ సందడి చేస్తున్నారు. మొత్తానికి ఈ సినిమా రిలీజ్ కు ముందే మంచి టాక్ ను సొంతం చేసుకుంటుంది.  ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ వద్ద విశ్వక్ రికార్డ్ క్రియేట్ చేస్తారనే అంటున్నారు.

అయితే విశ్వక్ సేన్ ఎందుకో రూటు మార్చాడని క్లియర్ గా తెలుస్తోంది. మాములుగా యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న ఈ యంగ్ హీరో ఎంచక్కా లవ్ స్టోరీస్ తీసుకోకుండా ఎందుకో ఇలా పల్లెటూరి ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ కథలపై దృష్టి పెట్టాడు. అయితే తనకు కథపై ఎంత నమ్మకం లేకుంటే ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడు. ఈ సినిమాను విద్య సాగర్ డైరెక్ట్ చేశాడు. అయితే ట్రైలర్ మాత్రం అందరినీ ఆకట్టుకుని మార్కులు కొట్టేసింది. మరి సినిమా ఎలా ఉండనుంది అనేది తెలియాలంటే ఇంకా కొద్ది రోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: