టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ హీరో పెళ్లిచూపులు సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు. విజయ్ దేవరకొండ ఆ తర్వాత హీరోగా నటించిన అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయలను సాధించడంతో విజయ్ దేవరకొండ టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోగా మారిపోయాడు.  విజయ్ దేవరకొండ చివరగా డియర్ కామ్రేడ్ సినిమాలో నటించాడు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపలేక పోయింది.  డియర్ కామ్రేడ్ సినిమా లో విజయ్ దేవరకొండ , రష్మిక మందన హీరోయిన్ గా నటించింది.

 విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లైగర్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.  ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన  అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది.  లైగర్ మూవీ తర్వాత విజయ్ దేవరకొండ,  పూరి జగన్నాథ్ దర్శకత్వంలో జనగణమన అనే సినిమాలో నటించబోతున్నాడు.  జన గణ మన సినిమా పూర్తయిన తర్వాత విజయ్ దేవరకొండ,  శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నటించబోతున్నాడు.  ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన సమంత హీరోయిన్ గా నటించబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.  ఇది ఇలా ఉంటే విజయ్ దేవరకొండ,  శివ నిర్వాణ కాంబినేషన్ లో తెరకెక్క బోయే మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతుంది.  ఈ సినిమాకు మలయాళం మ్యూజిక్ డైరెక్టర్ హేశమ్ అబ్దుల్ వాహబ్ సంగీతాన్ని సమకూర్చబోతున్నట్లు ఒక వార్త నెటింట్లో చక్కర్లు కొడుతోంది.  ఇది ఇలా ఉంటే హేశమ్ అబ్దుల్ వాహబ్ ప్రస్తుతం మలయాళ సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: