ప్రముఖ 'ఓ టి టి' సంస్థ లలో ఒకటి అయిన ఆహా ఎన్నో కొత్త కొత్త షో లను డిజైన్ చేస్తూ వాటి తో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న విషయం మనందరికీ తెలిసిందే . ఇప్పటికే సమంత తో 'సమ్ జమ్' బాలకృష్ణ తో ఆన్ స్థాపబుల్ వంటి టాక్ షో లను నిర్వహించి ఫుల్ సక్సెస్ అయిన ఆహా 'ఓ టి టి' సంస్థ కొన్ని రోజుల క్రితమే ఆహా ఇండియన్ ఐడల్ అనే పేరు తో ఒక సింగింగ్ షో ను కూడా ప్రారంభించింది . ఈ షో కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది.

ఈ షో ద్వారా ఇప్ప టికే ఎంతో మంది సింగర్ ల కు మంచి క్రేజ్ లభించింది. ఇండియన్ ఐడల్ షో కు తమన్, నిత్యా మీనన్, గాయకుడు కార్తీక్ ఈ షో కి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు . ఈ షో కు శ్రీరామ చంద్ర హోస్ట్  హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. కొంత కాలం క్రితమే ఈ షో కు సంబంధించిన సెమీ ఫైనల్ పూర్తి అయ్యింది . ఈ సెమీ ఫైనల్ కు టాలీవుడ్ క్రేజీ హీరోల్లో ఒకరు అయిన నందమూరి నటసింహం బాలకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేసి అదరగొట్టాడు. అలాగే బాలకృష్ణ కంటెస్టెంట్ లను కూడా బాగా ప్రోత్సహించాడు .

ఇది ఇలా ఉంటే మరి కొన్ని రోజుల్లో ఆహా ఇండియన్ ఐడల్ ఫినాలే జరగబోతోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఫైనల్ ఎపిసోడ్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రానున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే ఆహా ఇండియన్ ఐడల్ మేకర్స్ ప్రారంభించినట్లు సమాచారం. ఈ వార్తకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: