బాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకరైన రన్బీర్ కపూర్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రన్బీర్ కపూర్ తన కెరియర్ లో  బర్ఫీ , యే జవానీ హై దివానీ ,  తమాషా ,  అజబ్ ప్రేమ్ కీ గజబ్ కహానీ , సంజు వంటి విజయవంతమైన మూవీ లలో నటించి బాలీవుడ్ లో మాత్రమే కాకుండా ఇండియా వ్యాప్తంగా ఫుల్ క్రేజ్ ని సంపాదించుకున్నాడు.

ఇలా తనకంటూ హీరోగా ఒక సెపరేట్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న ఈ యంగ్ హీరో తాజాగా షంషేర్ అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాను తెలుగులో కూడా విడుదల చేయబోతున్నారు. అందులో భాగంగా ఇప్పటికే ఈ మూవీ తెలుగు ట్రైలర్ ను కూడా చిత్ర బృందం విడుదల చేయగా, ఈ ట్రైలర్ తెలుగు ప్రేక్షకులను కూడా విశేషంగా ఆకట్టుకుంది. షంషేర్ మూవీ ని  జూలై 22 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా అనేక ఇంటర్వ్యూ లలో పాల్గొంటున్న రన్బీర్ కపూర్ తాజాగా కూడా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తాజా ఇంటర్వ్యూలో భాగంగా రన్బీర్ కపూర్ 'యానిమల్' సినిమాకు సంబంధించిన అనేక విషయాలను తెలియజేశాడు.

తాజా ఇంటర్వ్యూలో భాగంగా రన్బీర్ కపూర్ మాట్లాడుతూ... నెగిటివ్ పాత్రలలో నటించాలని ఉంది. ప్రస్తుతం నేను నటిస్తున్న యానిమల్ మూవీ లో కొంత నెగటివ్ షేడ్స్ ఉంటాయి. యానిమల్ మూవీ లో నా క్యారెక్టర్ చూసి అందరూ షాక్ అవుతారు. ఆ పాత్రలో నటించడం ఆనందంగా ఉంది,  అలాగే భయంగా కూడా ఉంది అని అని తాజా ఇంటర్వ్యూలో రన్బీర్ కపూర్ చెప్పుకొచ్చాడు. యానిమల్ మూవీ కి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తుండగా, ఈ మూవీ లో  రన్బీర్ కపూర్ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: