దేశవ్యాప్తంగా దర్శకుడిగా తన కంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న మణిరత్నం గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మణిరత్నం తన కెరీర్ లో ఇప్పటి వరకు ఎన్నో వైవిధ్యమైన మూవీ లకు దర్శకత్వం వహించి దర్శకుడిగా తానేంటో అనేక సార్లు నిరూపించుకున్నాడు. అలాంటి దర్శకుడు తాజాగా పొన్నియన్ సెల్వన్ అనే భారీ బడ్జెట్ మూవీ ని  నిర్మించిన విషయం మనకు తెలిసిందే. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న పొన్నియన్ సెల్వన్ మూవీ మొదటి భాగం ఈ సంవత్సరం సెప్టెంబర్ 30 వ తేదీన గ్రాండ్ గా తమిళ్ తో పాటు తెలుగు ,  హిందీ , మలయాళ ,  కన్నడ భాషల్లో విడుదల కాబోతుంది. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడటంతో ఇప్పటికే ఈ మూవీ యూనిట్ ఈ మూవీ ప్రమోషన్ లను కూడా మొదలు పెట్టింది. 

అందులో భాగంగా ఈ మూవీ నుండి  కొన్ని ప్రచార చిత్రాలను మరియు రెండు పాటలను కూడా ఇప్పటికే చిత్ర బృందం విడుదల చేసింది. వీటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది.  ఈ మూవీ లో చియన్  విక్రమ్ , కార్తీ , జయం రవి ,  ఐశ్వర్య రాయ్ , త్రిష ముఖ్య పాత్రలో నటిస్తుండగా , ఏ ఆర్ రెహమాన్ ఈ మూవీ కి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ మూవీ ని లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంస్థలు నిర్మించాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ నుండి ఒక క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ఈ మూవీ కి తెలుగు లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న దిల్ రాజు సమర్పకుడిగా పొన్నియన్ సెల్వన్ తెలుగు వర్షన్ విడుదల కాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: