ఈ నెల 28న విడుద లవుతున్న సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ `ఫోకస్`యం గ్ హీరో విజయ్ శంకర్, `బిగ్‌బాస్` ఫేమ్‌ అషూరెడ్డి హీరో హీరోయిన్లుగా నటి స్తోన్నచిత్రం `ఫోకస్`.సుహాసిని మణిరత్నం, భానుచందర్ కీలక పాత్రలలో నటిస్తున్నఈ చిత్రానికి జి. సూర్యతేజ దర్శకుడు, వీరభద్రరావు పరిస నిర్మాత. మర్డర్‌ మిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో ఆద్యంతం ఉత్కంఠమైన కథ కథనా లతో న్యూ ఏజ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్ గా ఈ మూవీ తెరకెక్కింది. ఈ చిత్రంలో అషు రెడ్డి మొదటిసారిగా పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనుంది. అక్టోబరు 28న ఈ మూవీ థియే టర్స్‌లో గ్రాండ్ ‌గా విడుదలకానుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను హీరో శ్రీకాంత్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా శ్రీకాంత్‌ మాట్లాడుతూ.. 'ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. దర్శకుడు సూర్యతేజ మంచి సబ్జెక్ట్‌ను ఎంచుకు న్నారు. హీరో విజ య్ శంకర్ చాలా బాగా నటించాడు. మంచి  క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ చిత్రం విజ యం సాధించా లని కోరుకుం టున్నాను'అన్నారు.

'నా కెరీర్ లోనే బిగ్ బడ్జెట్ మూవీ 'ఫోకస్'. క్రైమ థ్రిల్లర్‌ జోనర్ ‌ని ఇష్టపడే ప్రేక్షకులకు మా చిత్రం ఫుల్‌మీల్స్‌లా ఉంటుంది'అని హీరో విజయ్‌ శంకర్‌ అన్నాడు. ఫోకస్ అనేది ఒక కొత్త తరహా క్రైమ్ థిల్లర్. తెలుగు ఆడియన్స్ ఈ జోనర్‌ను ఎక్కువగా ఎంకరేజ్ చేస్తారు. కొత్తగా ఉంటే తప్పకుం డా ఓన్ చేసు కుంటారు. ఊహించని మలుపులతో సరికొత్త కథ,కథనా లతో ఈ సినిమా రూపొందిం ది'అని దర్శకుడు సూర్యతేజ్‌ అన్నారు. స్కైరా క్రియేషన్స్‌ సమర్ప ణలో రిలాక్స్‌ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సు హాసిని, షియాజీ షిండే, భరత్‌ రెడ్డి, రఘు బాబు, సూర్య భగ వాన్‌ తది తరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: