టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన సినిమాలతో ఎన్నో సంవత్సరాలుగా ప్రేక్షకులను ఎంతగానో అల్లరిస్తున్నాడు. కామెడీతో జనాలను నవ్వించడమే కాకుండా ఎమోషనల్ సీన్స్ తో బాగా ఏడిపించకుగలడు నరేష్. ఇంకా సహా నటుడుగా కూడా అల్లరి నరేష్ చాలా బాగా ఆకట్టుకున్నాడు.ఇక గత కొంతకాలం నుంచి వరుస ప్లాపులతో వున్న అల్లరి నరేష్ 'నాంది' సినిమాతో మంచి విజయం సాధించాడు. ఆ సినిమా తరువాత నరేష్ చేస్తున్న తాజా చిత్రం 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'. టీజర్ తోనే ఈ సినిమా మంచి ఆసక్తిని పెంచింది. ఈ టీజర్‌ కు, ఆల్రెడీ రిలీజైన మెలోడీ సాంగ్‌ కి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.ఇక ఏఆర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని జీ స్టూడియోస్‌ తో కలిసి హాస్య మూవీస్‌ బ్యానర్ పై రాజేష్ దండా నిర్మిస్తున్నాడు.గిరిజన ప్రాంతమైన మారేడుమిల్లిలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ఎన్నికల విధులు నిర్వహించే ప్రభుత్వ అధికారిగా హీరో అల్లరి నరేష్‌ ఈ సినిమాలో కనిపించనున్నాడు.


అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా విడుదల కొంచెం ఆలస్యమౌతుంది. నవంబర్ 11న కాకుండా 25వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలౌతుంది. ఈ సందర్భంగా సినిమాకి సంబంధించి మరో పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అందులో అయితే గిరిజన ప్రాంతంలో పోలీసు అధికారులతో జీపులో ప్రయాణిస్తూ చాలా సీరియస్ గా కనిపిస్తున్నాడు అల్లరి నరేష్. కుర్ర హీరోయిన్  ఆనంది హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో వెన్నెల కిషోర్, ప్రవీణ్, సంపత్ రాజ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా.. రాంరెడ్డి సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నాడు.ఇంకా అబ్బూరి రవి మాటలు అందిస్తున్నాడు.ఇక నాంది సినిమా లాగే అల్లరి నరేష్ కి మంచి హిట్ ని ఇస్తుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: