తమిళ్ స్టార్ హీరో విజయ్ తాజాగా నటించిన బై లింగ్వల్ సినిమా వారసుడు.. టాలీవుడ్ లో భారీ ఎత్తున విడుదల కాబోతోంది. ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా జనవరి 12వ తేదీన సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుండగా.. చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీరసింహారెడ్డి చిత్రాలతో పాటు అజిత్ తెగింపు సినిమాలతో ఈ వారసుడు సినిమా పోటీ పడనుంది. అయితే అంతకుముందే ఘనంగా ఫ్రీ రిలీజ్ వేడుక జరపడానికి ఏర్పాట్లు చేశారు దిల్ రాజు . అంతే కాదు ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కు అటు రాజకీయాలలో ఇటు సినిమాలలో ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని ఇలా వారసుడు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చీఫ్ గెస్ట్ గా పిలిచినట్లు తెలుస్తోంది. నిజానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చినట్లయితే పవన్ కళ్యాణ్ అభిమానులలో ఈ సినిమాపై మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. తద్వారా సినిమాను ఎక్కువ సంఖ్యలో వీక్షించే అవకాశం కూడా ఉంది అన్నట్లుగా ప్లాన్ చేసి మరీ పవన్ కళ్యాణ్ ని ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ దిల్ రాజు ప్లాన్ వర్క్ అవుట్ అయితే సినిమా సంక్రాంతి బరిలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినట్టే.

దిల్ రాజు కూడా అటు టాలీవుడ్,  ఇటు బాలీవుడ్ లో కూడా తన ప్రొడక్షన్ హౌస్ ను విస్తరింప చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోని తొలిసారి విజయ్ తో  బైలింగ్వల్ ప్రాజెక్టు చేశారు. తమిళ్లో వరిసు పేరిట,  తెలుగులో వారసుడు పేరిట ఈ చిత్రాన్ని పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తున్నారు.  అంతేకాదు తెలుగు సినిమాకు మించి థియేటర్ లు  కేటాయించడం ఇప్పుడు టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: