మాటీవీలో ప్రసారమయ్యే బిగ్ బాస్ రియాలిటీ షో ఎంతటి గుర్తింపు పొందిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే ఆరు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో కి బిగ్ బాస్ సీజన్ వన్ కి జూనియర్ ఎన్టీఆర్ రెండవ సీజన్లో నాని మోడల్ సీజన్ నుండి మొన్న ముగిసిన ఆరవ సీజన్ వరకు నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే గత కొన్ని రోజులుగా బిగ్ బాస్ సీజన్ సెవెన్ కి నాగార్జున హోస్ట్గా రావడం లేదు అని వార్తలు రావడం జరుగుతుంది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ సెవెన్ కి నాగార్జున హోస్ట్ గా చేయడానికి ఇష్టపడడం లేదు అని ఇందులో భాగంగానే ఈ సీజన్ కి కొత్త పోస్ట్ ని వెతికే పనిలో ఉన్నారు అన్న వార్తలు సైతం వస్తున్నాయి.

అయితే ఒకవేళ ఈ సీజన్ కి కూడా నాగార్జున అని హోస్ట్గా వస్తే మాత్రం చాలామంది అభిమానులు వ్యతిరేకిస్తున్నారు అన్నట్లుగా తెలుస్తోంది. దానికి కారణం ఈ షోలో వీకెండ్ లో నాగార్జున పె సమీక్ష ఎవరికి కూడా నచ్చకపోవడమే. ఆయనకి నచ్చిన కంటెస్టెంట్ల మీద ప్రేమ చూపిస్తూ వారు ఎలాంటి తప్పు చేసినప్పటికీ నాగార్జున వాళ్ళని ఏమీ అనకపోవడం ఎంత మంచిగా ఆట ఆడినప్పటికీ వాళ్ళని మెచ్చుకోకపోవడం దీనికి కారణం అన్నట్లుగా తెలుస్తోంది. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బిగ్ బాస్ సెవెన్ కి హోస్టుగా మళ్లీ సీజన్ వన్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ ని తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికిగాను జూనియర్ ఎన్టీఆర్ ఒప్పుకోలేదు అన్న వార్తలు సైతం వినిపిస్తున్నాయి.

ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ గనక ఒప్పుకుంటే జూనియర్ ఎన్టీఆర్ అడిగినంత రెమ్యూనరేషన్ ఇవ్వడానికి కూడా మేకర్స్ సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.   కొన్ని రోజులుగా ఈ సీజన్ కి హోస్ట్ గా బాలకృష్ణ మరియు రానాని కూడా సంప్రదించినట్లుగా వార్తలు అయితే వచ్చాయి. ఇక వీటితో పాటు తాజాగా ఇప్పుడు మరో హీరో పేరు కూడా వెలుగులోకి వచ్చింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సీజన్ హౌస్ గా మంచు విష్ణు ని ఫైనల్ చేసినట్లుగా  తెలుస్తోంది.దీని అనంతరం ఈ వార్త విన్న చాలా మంది ఈ వార్తపై ట్రోల్స్ కూడా చేస్తున్నారు. చాలామందిని ఈ వార్త విన్నానంతరం అసలు ఈయన పనికి వస్తాడా..అన్న కామెంట్లను సైతం చేస్తున్నారు. దీంతోపాటు ఒకవేళ ఈ సీజన్ కి ఈయన  వస్తే గనుక ఈ సీజన్ కూడా ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుంది అంటూ వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు ..!!

మరింత సమాచారం తెలుసుకోండి: