ప్రముఖ టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న తాజా బైలింగ్వల్ చిత్రం వారసుడు. ఈ సినిమాని తమిళంలో వారిసు, తెలుగులో వారసుడు పేరిట రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఈ సినిమాను అనుకున్న విధంగా జనవరి 11వ తేదీన విడుదల చేయాలని సన్నాహాలు సిద్ధం చేశారు. కానీ పెద్ద సినిమాలు వాల్తేరు వీరయ్య , వీర సింహారెడ్డి విడుదలవుతున్న నేపథ్యంలో సినిమాలకు థియేటర్ల ఇబ్బంది ఏర్పడుతుందని ఆలోచించిన నిర్మాత దిల్ రాజు జనవరి 11వ తేదీన తమిళ్ లో వారిసు చిత్రాన్ని విడుదల చేసి.. తెలుగులో వారసుడు చిత్రాన్ని జనవరి 14వ తేదీన రిలీజ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసేశారు.

అయితే ఇటీవల మీడియా ముందుకు వచ్చిన దిల్ రాజు సినిమా విడుదల వేయడానికి గల కారణాన్ని ఇదే అని తెలియజేశారు. అయితే ముందు తెలుగు సినిమాను జనవరి 11న రిలీజ్ చేసి.. తమిళ్ సినిమాలో జనవరి 14వ తేదీన రిలీజ్ చేయవచ్చని కొంతమంది అడిగారు.  కానీ నాకు సినిమాపై నమ్మకం ఉంది.. అందుకే ఇలా చేశాను.. ఇప్పుడు తెలుగు సినిమాలు విడుదలవుతున్నప్పుడు.. ఆ సినిమాలకు థియేటర్లో ఇబ్బందులు రాకూడదు కదా.. పెద్దవాళ్లతో మాట్లాడిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నాను.. నా నిర్ణయంలో మార్పు లేదు అంటూ తెలిపారు.

అయితే ఇప్పుడు దిల్ రాజు నిర్ణయం పై ట్రేడ్ విశ్లేషకులు సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళ్ లో వారిసు చిత్రానికి నెగిటివ్ రివ్యూలు వస్తే.. తెలుగులో జనవరి 14వ తేదీన విడుదల కాబోయే తెలుగు వర్షన్ వారసుడు పై ఆ ప్రభావం పడే అవకాశం ఉంది కదా అని చెబుతున్నారు. ఒకవేళ చిరంజీవి వాల్తేరు వీరయ్య,  బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాలు గనుక మంచి విజయం సాధిస్తే మాత్రం వారసుడు సినిమా ముందుకు రావడం కష్టమవుతుంది అని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.. అయితే దిల్ రాజు ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నాడు.  ఇలాంటి సమయంలో మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: