నందమూరి నట సింహం బాలకృష్ణ తాజాగా వీర సింహా రెడ్డి అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి క్రాక్ మూవీ విజయంతో మంచి జోష్ లో ఉన్న గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించగా ,  శృతి హాసన్ ఈ మూవీ లో బాలకృష్ణ సరసన హీరోయిన్ గా నటించింది. వరలక్ష్మి శరత్ కుమార్ , దునియా విజయ్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించిన ఈ మూవీ కి సన్షేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించగా , మైత్రి సంస్థ వారు ఈ మూవీ ని నిర్మించారు.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ కి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు దక్కాయి. మరి ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్ లు వచ్చాయో తెలుసుకుందాం.

మూవీ కి నైజాం ఏరియాలో మొదటి రోజు 5.21 కోట్ల కలెక్షన్ లు రాగా , సీడెడ్ లో 5.55 కోట్లు , యూ ఏ లో 2.53 కోట్లు , ఈస్ట్ లో 1.73 కోట్లు ,  వెస్ట్ లో 2.08 కోట్లు ,  గుంటూరు లో 3.40 కోట్లు ,  కృష్ణ లో 1.65 కోట్లు ,  నెల్లూరు లో 1.20 కోట్లు మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి వీర సింహా రెడ్డి మూవీ కి మొదటి రోజు 23.35 కోట్ల షేర్ , 39.10 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు వచ్చాయి. ఇలా మొదటి రోజు వీర సింహా రెడ్డి మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాలలో అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: