టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ అయిన జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న సినిమా 'వినరో భాగ్యము విష్ణు కథ'. ఇక ఈ సినిమాకి సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజూ పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ఇంకా అలాగే 18 పేజెస్ లాంటి అద్భుతమైన సినిమాల తర్వాత జీఏ 2 పిక్చర్స్ బ్యానర్లో వస్తున్న సినిమా ఈ “వినరో భాగ్యము విష్ణు కథ”.షార్ట్ ఫిలిమ్స్ తో పాపులర్ అయ్యి టాలీవుడ్ హీరోగా మారిన యువ నటుడు కిరణ్ అన్నవరం హీరోగా నటించిన ఈ సినిమాలో కశ్మీర హీరోయిన్ గా నటించింది.ఈ సినిమా నుండి రిలీజైన సాంగ్స్, టీజర్ అన్ని కూడా సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేసాయి. అలానే రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ కూడా ఈ మూవీపై మరింత అంచనాలను పెంచింది.


నెంబర్ నైబరింగ్ కాన్సప్ట్ తో వస్తున్న ఈ సినిమా కోసం యూత్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా ఈ మహాశివరాత్రి పండుగ కానుకగా ఫిబ్రవరి 18 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదల కాబోతుంది ఈ సినిమా. ఇక ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర బృందం ఈరోజు ఓ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేయడం జరిగింది.ఇక ఇందులో భాగంగా సినిమా చాలా బాగా వచ్చిందని.. ఈ మూవీలో ప్రేమ, కామెడీ , థ్రిల్లింగ్ .. ఇలా అన్ని అంశాలు కూడా బాగా మిళితమై ఉన్నాయని. కేవలం ఒక సెక్షన్ ఆడియన్స్ మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ మూవీ ఖచ్చితంగా చాలా బాగా ఆకట్టుకుంటుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేసింది.ఇంకా అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఫిబ్రవరి 16 వ తేదీన నిర్వహించబోతున్నామని.. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా టాలీవుడ్ స్టార్ కిడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ హాజరు కాబోతున్నట్లు కూడా ఈ సందర్భంగా చిత్ర బృందం తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: