యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాబి డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. జనతా గ్యారేజ్ తర్వాత ఎన్.టి.ఆర్ చేస్తున్న సినిమాగా క్రేజ్ సంపాదించగా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. సినిమాలో తారక్ మూడు విభిన్న పాత్రల్లో నటిస్తారని టాక్. అయితే ఈ లాజిక్ తో ఒకప్పుడు అజిత్ తీసిన వరలారు సినిమా కాపీ కొట్టి బాబి ఈ సినిమా చేస్తున్నాడని అంటున్నారు.


అజిత్ హీరోగా త్రిపాత్రాభినయం చేసిన వరలారు సినిమాలో ఓ క్యారక్టర్ తండ్రిగా మరో రెండు క్యారక్టర్లు హీరో విలన్ గా చేశారు. సేమ్ అదే విధంగా తారక్ కూడా ఈ సినిమాలో మూడు పాత్రలు చేస్తున్నాడు. ఒక పాత్ర విలన్ అవుతుందని టాక్. సో దీన్ని బట్టి కచ్చితంగా వరలారు సినిమా కథతో అటు ఇటుగా మార్చి బాబి జై లవ కుశ సినిమా చేస్తున్నాడని టాక్. 


ఇక ఈ వాదనలకు చిత్రయూనిట్ ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి. గ్యారేజ్ హిట్ తో మళ్లీ తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్న తారక్ ఓ కాపీ కథ లేదా స్పూర్తి పొందిన కథతో సినిమా తెస్తాడా అన్న వర్షన్ కూడా వినపడుతుంది. బాబి ముందుగా ఈ కథ ఎక్కడ నుండి తీసుకున్నది అనేది తారక్ తో డిస్కస్ చేసి ఉండొచ్చు. 


ఈమధ్య తారక్ నెగటివ్ షేడ్ తో ఉన్న ఓ భయంకరమైన పిక్ సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. విలన్ గా తారక్ వారెవా అనిపించడం ఖాయమని అది చూసినవారంగా అన్నారు. మరి ఓకేసారి ఈ కథ కాపీ అని తెలియగానే కాస్త నిరాశ చెందుతున్నారు. మరి ఈ కాపె అలిగేషన్స్ మీద బాబి అండ్ కో ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: