ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ప్రతి మ్యాచ్ కూడా ఉత్కంఠ భరితంగా సాగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక ఈ మ్యాచ్ లు చూస్తూ క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ పొందుతూ ఉన్నారు అని చెప్పాలి. అయితే ప్రతిసారి ఐపీఎల్ సీజన్ జరిగినప్పుడల్లా కూడా అటు ఇంగ్లాండ్ ప్లేయర్లు ఎంతో కీలకంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఇక ఆయా జట్ల తరఫున ప్రాతినిధ్యం వహిస్తూ అదరగొడుతూ ఉంటారు.


 అయితే ఇక ఇప్పుడు 2024 ఐపీఎల్ సీజన్లో కూడా ఎంతోమంది ఇంగ్లాండ్ ప్లేయర్లు ఇలా కొన్ని టీమ్స్ తరఫున కొనసాగుతూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇప్పుడు ప్లే ఆఫ్ సమయానికి ఇంగ్లాండ్ ప్లేయర్లను కలిగి ఉన్న కొన్ని టీమ్స్ కి ఊహించిన షాక్ లు తగలబోతున్నాయి అని తెలుస్తుంది. ఎందుకంటే.. ప్రస్తుతం ఐపీఎల్ లో కొన్ని టీమ్స్ తరఫున ఆడుతున్న ప్లేయర్ లందరూ కూడా ఇప్పుడు  ఐపీఎల్ నుంచి తప్పుకోబోతున్నారు. ఏకంగా స్వదేశానికి వెళ్లబోతున్నారు అన్నది తెలుస్తోంది. దీంతో ఆయా టీమ్స్ కి బిగ్ షాక్ తగలబోతుంది.


 ప్లే ఆఫ్ సమయానికి ఇంగ్లాండ్ ప్లేయర్లు దూరం కాబోతున్నారు. మే 22వ తేదీ నుంచి ఇంగ్లాండ్ పాకిస్తాన్ మధ్య 4మ్యాచ్ ల t20 సిరిస్ జరగబోతుంది అని చెప్పాలి. ఇక వరల్డ్ కప్ ఎంపిక చేసిన జట్టునే ఆ పర్యటనకు సెలెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఐపీఎల్ లో వివిధ జట్ల తరఫున ఆడుతున్న బట్లర్, సాల్ట్, మోయిన్ అలీ, బెయిర్ స్ట్రో,  జాక్స్, కరన్ లివింగ్ స్టోన్ ఐపీఎల్ వదిలి వెళ్ళబోతున్నారు. మరోవైపు మే 21వ తేదీ నుంచి ఐపీఎల్ ప్లే ఆఫ్ మ్యాచ్లు జరగబోతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇంగ్లాండ్ ప్లేయర్లు దూరమైన తర్వాత ఆయా జట్లు ఎలాంటి వ్యూహాలను సిద్ధం చేసుకుంటాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl