తెలుగు బుల్లితెరపై హాట్ యాంకర్లు గా పేరు తెచ్చుకున్నారు అనసూయ, రష్మి.  ‘జబర్ధస్ద్’ కామెడీ షో మొదలైన కొత్తలో అనసూయ చిట్టి పొట్టి డ్రెస్సులు వేసుకొని కవ్వించే మాటలతో కుర్రాళ్ల మనసు దోచింది.  అతి తక్కువ కాలంలోనే మంచి పాపులారిటీ తెచ్చుకున్న అనసూయ తర్వాత వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అంతే కాదు ఇతర ఛానల్స్ లో యాంకర్ గా కొనసాగుతూ బిజీగా మారిపోయింది.  బజర్ధస్త్ కామెడీ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె ప్లేస్ లో రష్మీ ఎంట్రీ ఇచ్చింది.   
Image result for anasuya hot
అనసూయ వెండి తెరపై వరుస ఛాన్స్ లు కొట్టడమే కాదు ఐటమ్ సాంగ్స్ లో కూడా నటిస్తుంది.  ఈ మద్య సెల్ఫీ అడిగిన ఓ బాలుడి మొబైల్‌ పగలగొట్టిన వివాదం రచ్చ కావడంతో సోషల్ మీడియాకి గుడ్ బై చెప్పేసింది హాట్ యాంకర్ అనసూయ. సెల్ఫీ అడిగితేనే ఫోన్ పగలగొట్టేస్తుందా అంటూ ఆమెను సోషల్‌ మీడియాలో ఏకిపారేశారు నెటిజన్లు.  దాంతో నెటిజన్ల పోరు పడలేక అనసూయ ట్విటర్‌, ఫేస్‌ బుక్‌ అకౌంట్లను క్లోజ్ చేసుకుని జబర్దస్త్ షోలు చేసుకుంటోంది. ఆవేశంలో తీసుకున్న నిర్ణయానికి రియలైజ్ అవుతూ తిరిగి సోషల్ మీడియాకి ఓపెన్ అంటూ బోర్డు పెట్టేందుకు ముహూర్తం పెట్టుకుంది అనసూయ.
Image result for anasuya hot
మహిళా దినోత్సవం సందర్భంగా ఓ వెబ్ సైట్ ఫేస్ బుక్ లైవ్‌లో అభిమానులతో ముచ్చటించిన అనసూయ తన కుటుంబ సభ్యుల కోసమే సోషల్ మీడియాకు దూరంగా ఉన్నానని తెలిపారు. అయితే మళ్లీ ఎప్పుడు ఓపెన్ చేస్తారు అంటే.. తాను నటిస్తున్న ‘రంగస్థలం’ మూవీ రిలీజ్ తర్వాత అని చెప్పేసింది.అయితే ‘రంగస్థలం’ సినిమాలో అనసూయ ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తుండటం.. ఆ సినిమా రిలీజ్‌కు ముందే ఆమెపై విపరీతమైన నెగిటివ్ కామెంట్స్ ట్రోల్ అవుతుండటంతో ఈ ప్రభావం సినిమాపై పడొచ్చనే అనసూయను కంట్రోల్‌లో పెట్టారా అనే సందేహాలు మొదలయ్యాయి.
Image result for anasuya police case
మరోవైపు తాను ఇలాంటి వాటికి భయపడే టైప్ కాదని.. ఈ సంఘటనలో తన కుటుంబ సభ్యులు ఇబ్బంది పడటం తట్టుకోలేకపోయానన్నారు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేద్దమనే ఉద్దేశంతోటే కొద్ది రోజులు సోషల్‌ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పుకొచ్చారు అనసూయ.


మరింత సమాచారం తెలుసుకోండి: