ప్రస్తుతం టాలీవుడ్లో
పూజా హెగ్డే హవా ఓ రేంజ్లో నడుస్తోంది. హిట్లు, ఫట్లతో సంబంధం లేకుండా వరుసపెట్టి స్టార్ హీరోలతో ఛాన్సులు దక్కించుకుంటోంది. ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్, మహేష్ ఇలా వరుస పెట్టి స్టార్ హీరోలు ఆమెకు రెండోసారి ఛాన్స్ ఇచ్చేందుకు కూడా
సుముఖంగానే ఉన్నారు. ఇటు యువతలోనూ పూజ సినిమాలో ఉందంటే ఆ సినిమా ఒక్కసారి రిజల్ట్తో సంబంధం లేకుండా చూసేందుకు థియేటర్లకు క్యూ కడుతున్నారు.
ఇక పూజా కోసం టాలీవుడ్ స్టార్ హీరోలు ఎంతగా పరితపిస్తున్నారంటే ఆమెతో ఒకేసారి ముగ్గురు హీరోలు ఆన్స్క్రీన్ రొమాన్స్ చేసేందుకు అయినా వెనుకాడడం లేదు. చివరకు అందరు స్టార్ హీరోలు ఒకేసారి పూజాకు తమ సినిమాల్లో ఛాన్స్ ఇవ్వడంతో ఆమె డేట్లు ఎడ్జెస్ట్ చేయలేక ఒకే రోజు మూడు షిప్టుల్లో ముగ్గురు స్టార్ హీరోలతో ఆన్స్క్రీన్ రొమాన్స్కు సైతం సై అంటోంది.
ఈ విషయమై పూజ స్పందిస్తూ గతేడాది ఒకేసారి 4 సినిమాలు చేశానని... ఉదయం ఎన్టీఆర్తో అరవింద సమేత, మధ్యాహ్నం మహేష్తో మహర్షి, సాయంత్రం ప్రభాస్ సినిమాల కోసం మేకప్పులు మార్చుకుని మరీ షూటింగ్ల్లో పాల్గొన్నానని పూజ చెప్పింది. ఇలా ఒకేరోజు, ఒకేసారి ముగ్గురు పెద్ద హీరోలతో కలిసి చేయడం తన కెరీర్ లోనే బెస్ట్ మూమెంట్ అని కూడా పూజా ఫుల్ ఖుషీ అవుతూ చెపుతోంది. ఇక ఎన్టీఆర్ అరవింద సమేతకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్న ఈ బ్యూటీ మహర్షి విషయంలో మాత్రం
వంశీ పైడిపల్లి నో చెప్పడంతో చెప్పలేకపోయింది.